గణపురం :గణపురం మండలంలోని బుద్దారం గ్రామం సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున 24 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్లుకున్నట్లు గణపురం ఎస్సై ఉదయ్ కిరణ్ తెలిపారు. ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలంలో కేశవాపూర్ గ్రామానికి చెందిన జడల కుమారస్వామి శుక్రవారం తెల్లవారుజమున టాటా ట్రాలి వాహనంలో అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని బుద్దారం సమీపంలో పట్టుకున్నట్లు గణపురం ఎస్సై మాధవ్ గౌడ్ తెలిపారు. దీంతో జడల నిందితుల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.