ఖిలావరంగల్/కరీమాబాద్/వరంగల్చౌరస్తా/గిర్మాజీపేట, అక్టోబర్ 2: జాతిపిత మహాత్మాగాంధీ నమ్మిన అహింస, సత్యాగ్రహం సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని అదనపు కలెక్టర్లు శ్రీవత్స కోట, హరిసింగ్ కోరారు. గాంధీజీ జయంతిని పురస్కరించుకొని అదనపు కలెక్టర్లు, ఏవో శ్రీకాంత్ కలెక్టరేట్లో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశ స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చిన మహనీయుడు గాంధీజీ అని కొనియాడారు. కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. అలాగే, మామునూరులోని 4వ బెటాలియన్లో కమాండెంట్ శివప్రసాద్రెడ్డి గాంధీ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్పొరేటర్లు పల్లం పద్మ, మరుపల్ల రవి, పోశాల పద్మ ఆయా డివిజన్లలో గాంధీ జయంతి నిర్వహించారు. ఎంజీఎం ఆవరణలోని మహాత్ముడి విగ్రహానికి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ పూలమాల వేసి నివాళులర్పించారు. వరంగల్ స్టేషన్రోడ్లోని బాపూజీ విజ్ఞానకేంద్రంలో మహాత్మగాంధీ విగ్రహానికి టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాశ్ నివాళులర్పించారు.
గాంధీ చూపిన మార్గం ఆచరణీయం
గాంధీ చూపిన మార్గం ఆచరణీయమని మేయర్ గుండు సుధారాణి అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా 26వ డివిజన్లో ఆమె బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నవభారత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు. కార్పొరేటర్ బాలిన సురేశ్, అసోసియేషన్ అధ్యక్షుడు దిడ్డి అనిల్కుమార్, గౌరవ సలహాదారులు గుండు రవిప్రసాద్, వెంగళ సత్యనారాయణ, జంజిరాల వేణు, బుర్రా రవికుమార్, సురేందర్, అశోక్, రమేశ్, శ్రీనివాస్, కొండబత్తిని రమేశ్, రవి, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. అలాగే, గాంధీ, ఎల్బీశాస్త్రి జయంతి సందర్భంగా పిన్నవారివీధిలోని వాసవీ క్లబ్ కార్యాలయ ఆవరణలో వారి చిత్రపటాలకు అధ్యక్షుడు ఎం జయకుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిరుపేదలకు దుస్తులు, గోధుమలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అధ్యక్షుడు ఎం జయకుమార్, కార్యదర్శి అక్కినపెల్లి నిర్మల, కోశాధికారి ఎం జ్యోతి, ఉపాధ్యక్షుడు సిద్ధంశెట్టి పసుపతి, ఆర్సీ తోట వైద్యనాథ్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్బహుదూర్ శాస్త్రి జయంతి నిర్వహించారు.
రామన్నపేటలోని గాంధీ విగ్రహానికి ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి ఆధ్వర్యంలో పూలమాల వేశారు. ఎల్లమ్మబజార్లోని శాఖ లైబ్రరీ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి వాసవీ క్లబ్ ప్రతినిధులు నివాళులర్పించారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రధాన కార్యాలయం వద్ద మార్కెట్ కమిటీ జిల్లా టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గజ్జెల రామ్కిషన్, ప్రధాన కార్యదర్శి గాజ వేణుగోపాల్, పాలకుర్తి సదానందం, హేమనాయక్, జన్ను భాస్కర్, వేముల వెంకటేశ్వర్లుగౌడ్, మురళీధర్రెడ్డి, తోట చందర్, వెలిశాల రాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ పరికిపండ్ల అశోక్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. కాశీబుగ్గలోని శ్రీకాశీవిశ్వేశ్వర రంగనాథస్వామి ఆల యం ఎదుట గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గాంధీజీకి నివాళులర్పించారు. అలాగే, టీఆర్ఎస్ నాయకులు పల్లకొండ హరికుమార్, కార్పొరేటర్లు గుండేటి నరేంద్రకుమార్, ఓని స్వర్ణలత ఆధ్వర్యంలో వేర్వేరుగా గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు.
19వ డివిజన్ గాంధీనగర్లోని గాంధీజీ విగ్రహానికి టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఈటల ఉమామహేందర్ ఆధ్వర్యంలో గాం ధీ జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొట్ల సదానందం, మర్రి చందర్, కొనగాల నరందర్, చింత రాజు, రవికాంత్, ఎదులాపురం బ్రహ్మచారి, నర్సింహస్వామి, ఆకుల మహేశ్వర్, రిజ్వన్, రవి, శేషి, బాబు పాల్గొన్నారు. వరంగల్ దేశాయిపేటలోని లక్ష్మి మెగా టౌన్షిప్లో గాంధీ జయంతి నిర్వహించారు. కాలనీ కమిటీ గౌరవాధ్యక్షుడు వేముల వెంకటేశ్వర్లు, స్థానికులు ధారా ప్రకాశ్రావు, రామచంద్రమూర్తి, సాంబయ్య, వెంకటేశ్వర్రావు, మామిడి రమేశ్ పాల్గొన్నారు.