కృష్ణకాలనీ, అక్టోబర్ 2 ; గిరిజనులు ఆత్మబంధువు సీఎం కేసీఆర్ అని సంతుసేవాల్ సేనా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గూగులోత్ సంతోష్ నాయక్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం.. రాష్ట్రంలోని గిరిజనులకు జానాభా దామాషా ప్రకారం.. 10 శాతం రిజర్వేషన్ పెంచడాన్ని సంతోషిస్తూ సంతు సేవాలాల్ సేనా జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు బానోత్ రాజునాయక్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి సంతోష్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గిరిజనుల ఆర్థికాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. టీఆర్ఎస్ పానలోనే గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి సా ధించారన్నారు. గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గిరిజనులకు రిజర్వేషన్ శాతాన్ని పెచుతానని హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకా రం.. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ పెంచినందకు సీఎం కేసీఆర్కు గిరిజనులమంతా రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో సంతుసేవాలాల్ సేనా రాష్ట్ర కార్యదర్శి పోరిక రాహుల్ నాయక్, జిల్లా మహిళా అధ్యక్షురాలు శారద, జిల్లా యువసేనా అద్యక్షుడు మధూకర్ నాయక్, అర్బన్ అధ్యక్షుడు దేవేందర్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట రాజు నాయక్, చిట్యాల మండలాధ్యక్షుడు రాజు నాయక్, నాయకులు రాకేశ్నాయక్, యాకూబ్ నాయక్, ఈశ్వర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.