నర్సంపేట/ఖానాపురం/పర్వతగిరి/దుగ్గొండి/సంగెం/మట్టెవాడ, సెప్టెంబర్ 18: జిల్లాలోని పలు గణేశ్ మండపాల వద్ద శనివారం నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. నర్సంపేట నెహ్రూనగర్లో ఐఎంఏ నర్సంపేట అధ్యక్షుడు డాక్టర్ లెక్కల విద్యాసాగర్రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మున్సిపల్ కౌన్సిలర్ జీ రజిత, టీఆర్ఎస్ నాయకుడు రాజు పాల్గొన్నారు. ఖానాపురం మండలం మంగళవారిపేటలో హనుమాన్ వినాయక మండపం వద్ద దాత తొట్ల వెంకటేశ్వర్లు అన్నదానం చేయగా ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు ప్రారంభించారు. మండలకేంద్రంలో పేరాల హరీశ్, వేజళ్ల కిషన్రావు అన్నదానం చేశారు. టీఆర్ఎస్ నాయకులు పూర్ణచందర్రావు, వేణుకృష్ణ, కాస ప్రవీణ్కుమార్, నాగేశ్వర్రావు పాల్గొన్నారు.
పర్వతగిరిలో మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు, ఏసీపీ భోజరాజు పూజలు చేశారు. అన్నారం షరీఫ్ గ్రామంలో శివాత్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఎస్సై నవీన్కుమార్, దాతలు ఈరగాని రాధికామనోహర్ పాల్గొన్నారు. దుగ్గొండిలో వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉపకులాల జిల్లా అధ్యక్షుడు బొటికె అనసూర్య-సంజీవ దంపతులు అన్నదానం చేశారు. సంగెంలో శ్రీసంఘమేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుడికి 21 రకాల కూరగాయలతో శాకంబరుడిగా అలంకరించారు. ఉత్సవ కమిటీ సభ్యులు రాజు, రాకేశ్, ప్రతాప్, రాజేశ్, చందు, అఖిల్, మహేశ్, సందీప్ పాల్గొన్నారు. వరంగల్ 29వ డివిజన్లోని ఓఎస్నగర్లో అన్నదానం చేశారు. టీఆర్ఎస్ నాయకులు నాగరాజు, సుకుమార్, టేకేశ్వర్మ, దస్తగిరి పాషా, జీటీ నాగరాజు, రబ్బాని, రియాసత్, భద్రి, విజయేందర్, గణేశ్, రంజిత్, రాజేశ్ పాల్గొన్నారు.