హనుమకొండ, సెప్టెంబర్ 8 : ప్రశాంత వాతావరణంలో వినాయ చవితి, నిమజ్జన ఉత్సవాలు జరుపుకోవాలని, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని హనుమకొండ, వరంగల్ జి ల్లాల కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, గోపి పేర్కొన్నా రు. బుధవారం మనుమకొండ కలెక్టరేట్లో గణేశ్ ఉ త్సవాల నిర్వహణపై జిల్లా అధికారులు, శాంతి కమిటీలతో కలెక్టర్లు, సీపీ తరుణ్జోషి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు మా ట్లాడుతూ.. గణేశ్ ఉత్సవాలను కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలన్నారు. ఉత్సవాల, శాంతి కమి టీ సభ్యులు మట్టి గణపతి విగ్రహాల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. ప్రతి గణేశ్ మం డపానికి ఒక ఇన్చార్జిని నియమించాలని సూచించారు. ఈ సా రి గణేశ్ విగ్రహాల నిమజ్జనం కో సం 13 ప్రాంతాలను గుర్తించామని, ఆయా స్థలాల్లో లైటింగ్, బారికేడ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదాలు జరుగకుండా గజ ఈతగాళ్లను అం దుబాటులో ఉంచాలన్నారు. ప్రతి మండప సమాచా రం తప్పకుండా ఇవ్వాలన్నారు. నిమజ్జనం రోజు మ ద్యం దుకాణాలు మూసి వేయాలని ఆదేశించారు.
ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు..
వినాయక నిమజ్జనానికి ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు చేయాలని వరంగల్ కలెక్టర్ గోపి సూచించారు. నిరంతర విద్యుత్తు సరఫరా చేయాలని, నిమజ్జన ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. నిమజ్జనం సందర్భంగా అవసరమైన పారిశుధ్య పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో 24 గంటలు శానిటేషన్ సిబ్బంది పనిచేయాలని గ్రేటర్ కార్పొరేషన్ కమిషనర్ ప్రావీణ్య అన్నారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి..
గణేశ్ మండపాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్ తరుణ్జోషి అన్నారు. అన్ని మండపాల వద్ద పోలీస్ పెట్రోలింగ్ పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. మండపాల అనుమతులు ఆన్లైన్లోనే పొందాలన్నారు. సమావేశంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, హరిసింగ్, ఆర్డీవోలు వాసుచంద్ర, మహేందర్జీ, డీసీపీ వెంకటలక్ష్మి, అడిషనల్ డీసీపీ పుష్ప తదితరులు పాల్గొన్నారు.