సంగెం, సెప్టెంబర్ 4: కష్టపడి పనిచేసిన వారికే పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని రైతుబంధు సమితి మండల కన్వీనర్ కందకట్ల నరహరి అన్నారు. శనివారం టీఆర్ఎస్ గ్రామ కమిటీ ఎన్నికల కార్యక్రమంలో భాగంగా మండలంలోని ముమ్మిడివరం, నార్లవాయి గ్రామాల్లో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పార్టీ ముమ్మిడివరం గ్రామ అధ్యక్షుడిగా లక్క మొగిలి, ఉపాధ్యక్షుడిగా కలకొండ కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి దామెరుప్పుల రాజు, సంయుక్త కార్యదర్శిగా పామునూరి స్వామి, కోశాధికారిగా ఉమ్మగాని రమేశ్ ఎన్నికయ్యారు. నార్లవాయి గ్రామ అధ్యక్షుడిగా బూర ప్రకాశ్, ఉపాధ్యక్షులుగా కోడూరి కృష్ణ, ఆకుల రాజు, ఎండీ యాకూబ్పాషా, ప్రధానకార్యదర్శిగా దామెర రంజిత్, సంయుక్త కార్యదర్శిగా గొటుకుల చిన్న రమేశ్, కోశాధికారిగా తాడెం శారద, వీటితో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ, సోషల్ మీడియా కమిటీలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మండల సమన్వయ కమిటీ సభ్యులు బుక్క మల్లయ్య, సంగెం సొసైటీ చైర్మన్ వేల్పుల కుమార్యాదవ్, ఉండీల రాజు, కో ఆప్షన్ సభ్యుడు మన్సూర్ అలీ, జాగృతి జిల్లా అధ్యక్షుడు యార బాలకృష్ణ, సర్పంచ్లు ఇజ్జగిరి స్వప్న, కోడూరి రజిత, నాయకులు ఇజ్జగిరి అశోక్, పెండ్లి పురుషోత్తం, దుడ్డె ప్రశాంత్గౌడ్, పోశాల ప్రవీణ్, పొడేటి ప్రశాంత్, మాదినేని రాజు, ఉపసర్పంచ్ కోటి, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.