జనగామ : రాష్ట్రంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ నాయకులు మంత్రి కిషన్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జిల్లా కేంద్రంలో కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టి బొమ్మను దహనం చేశారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర విభజన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జెడ్పీచైర్మన్ పాగాల సంపత్ రెడ్డి తదితరులు ఉన్నారు.