స్టేషన్ ఘన్పూర్: ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్య కార్మికులను నియమించాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టిఎఫ్) సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాడిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర బాధ్యులు సంజీవ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థుల సంఖ్య పెరిగిందని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్దుల సంఖ్య పెరగడం, పాఠశాలలో పారిశుద్యకార్మికులు లేకపోవడంతో పాఠశాలలోని పరిసరాలు, మరుగుదొడ్లు సరిగా లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం స్పందించి పారిశుద్య కార్మికులను నియమించి పాఠశాలలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధానకార్యదర్శి గుండు సదానందం, విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.