జనగామ : రైతాంగానికి ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి (MLA Palla Rajeshwar Reddy) డిమాండ్ చేశారు. స్టేషన్ఘన్పూర్ బీఆర్ఎస్ (BRS) ఆధ్వర్యాన నిర్వహించిన రైతు దీక్ష (Rythu Diksha ) లో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతాంగ వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ రైతుల ఉసురుపోసుకునే ప్రభుత్వానికి పుట్టగతులుండవని హెచ్చరించారు.
రైతులకు వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేయాలని, రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. కౌలు రైతులకు హామీ ఇచ్చిన విధంగా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యానికి మద్దతు ధర అందించడంతోపాటు 500 రూపాయల బోనస్ చెల్లించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ (Congress government) అసమర్థ పాలన వల్ల రైతులు సాగునీరు అందక పంట నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు.
పంట నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ. 25వేల నష్టపరిహారం అందించాలన్నారు. దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు పార్లమెంటు ఎన్నికల్లో (Parliment Elections) తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.