జనగామ : నిండుగా కరెంటు, పుష్కలంగా గోదావరి జిల్లాలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నియోజకవర్గంలో వర్గంలోని లబ్ధిదారులకు ఇప్పటివరకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా రూ.వంద కోట్ల ఆర్థిక సహాయం అందజేశామన్నారు.
వచ్చే ఎన్నికల్లో మనమంతా కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను అమ్ముకొని పరిపాలిస్తుంటే, సీఎం కేసీఆర్ శ్రమను నమ్ముకొని ప్రజా పరిపాలన చేస్తున్నాడని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వం అన్నారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి. అన్నదాతల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.