జనగామ : ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరంగా మారిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని పాలకుర్తికి చెందిన రాజు కూతురు సింధూజ అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్నది. కాగా, సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ.2 లక్షల విలువైన చెక్కును సింధూజ తండ్రికి శుక్రవారం హైదరాబాద్లో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదల పాలిట వరంగా మారిందన్నారు. కష్టాల్లో ఉన్న నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ సంజీవనిలా పనిచేస్తుందన్నారు.