Child | జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఆలీంపూర్ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో మిషన్ భగీరథ పైప్ లీక్ అవుతుందని మరమ్మతుల కోసం అధికారులు 20 రోజుల క్రితం నాలుగు మీటర్ల పొడవైన గుంత తవ్వి ఉంచారు. అయితే ప్రాథమికోన్నత పాఠశాలలోని అంగన్వాడీ ఆయాగా పనిచేస్తున్న కవిత అనే మహిళ కూతురు మోక్షిత(5) ప్రమాదవశాత్తు ఆ గుంతలో పడిపోయింది.
మోక్షిత గుంతలో పడడం గమనించి చిన్నారి అక్క దీక్షిత తల్లికి చెప్పింది. దీంతో వెంటనే గుంతలోకి దిగిన తల్లి మోక్షితను బయటికి తీయగా, మోక్షిత అప్పటికే మృతి చెందింది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం వల్లే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని మృతదేహంతో గ్రామస్తులు రోడ్డుపై ఆందోళనకు దిగారు.
ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు బలి తీసుకున్న మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఆలీంపూర్ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో మిషన్ భగీరథ పైప్ లీక్ అవుతుందని మరమ్మతుల కోసం 20 రోజుల క్రితం నాలుగు మీటర్ల గుంత తవ్వి ఉంచిన అధికారులు
ప్రమాదవశాత్తు ఆ గుంతలో… pic.twitter.com/O2qf4wXjmE
— Telugu Scribe (@TeluguScribe) April 30, 2026