జనగామ : సీఎం కేసీఆర్ చిత్రపటానికి బుధవారం పూసల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. వెనుకబడిన కులాలకు రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఆత్మగౌరవ భవనాలకు ఎకరం స్థలం, భవన నిర్మాణానికి కోటి రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇచ్చిన నిలబెట్టుకుంది.
హైదరాబాద్లో వెనుకబడిన తరగతుల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా బుధవారం వివిధ కులాలకు కేటాయింపు పత్రాలను అందజేసారు. ఈ మేరకు పూసల కులం జనగామ జిల్లా కమిటీ పక్షాన స్థానిక పూసల భవనంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వెనుకబడిన వర్గాలకు చేస్తున్న సహాయం మరువలేనిదన్నారు.
కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షుడు తుపాకుల నారాయణ, జనగామ జిల్లా అధ్యక్షుడు చిన్ని పల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పన్నీర్ భానుచందర్, నాగిశెట్టి శ్రీనివాస్, మండల గౌరవ అధ్యక్షుడు రవీందర్, మండల అధ్యక్షుడు పన్నీరు మధుసూదన్, ప్రధాన కార్యదర్శి పన్నీరు గోవర్ధన్, ముద్రకోల రవి, గోరంట్ల సత్యం పగిడిపల్లి మల్లేష్, పన్నీరు కళావతి, పగిడిపల్లి సత్యనారాయణ, రమేష్, పన్నీరు లలిత, జమున, స్వరూప తదితరులు పాల్గొన్నారు.