తాడ్వాయి, ఫిబ్రవరి 26 : మహాజాతర సందర్భంగా సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై ఏర్పాటు చేసిన హుండీలను సోమవారం దేవాదాయ శాఖ అధికారులు హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపానికి తరలించారు. సుమారు 462 ఇనుప హుండీలు, 30 బట్ట హుండీలు భక్తుల కానుకలతో నిండాయి. వాటిని ఆర్టీసీ బస్ క్యారియర్లలో తహసీల్దార్ రవీందర్, మేడారం ఈవో రాజేంద్రం ఆధ్వర్యంలో తరలించగా రాత్రి 12గంట లకు హనుమకొండ చేరాయి. బుధవారం నుంచి హుండీ ల ఆదాయాన్ని లెక్కించనున్నట్లు ఈవో తెలిపారు.