వరంగల్ చౌరస్తా, ఫిబ్రవరి 3 : చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు, 34వ డివిజన్ కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి జన్మదినం సందర్భంగా వెంకటరమణ జంక్షన్లోని గంగా హాస్పిటల్, ధర్మరుద్ర క్లినిక్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం హాస్పిటల్ ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో వైద్యులు దిడ్డి శ్రవణ్కుమార్, దిడ్డి స్వప్నలతలు పాల్గొని కేక్ కట్ చేశారు.
అనంతరం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. తాను పుట్టిన పెరిగిన ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడపడం కోసం ఎంతగానో కృషి చేస్తున్న కుమారస్వామికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డాక్టర్ దయాసాగర్, డాక్టర్ పూర్ణచందర్, జన్ను క్రాంతి, బుగ్గ సుధాకర్, కొండపర్తి సాగర్, శ్రీకాంత్, అరుణ్, వీరేశం, అదిల్, తదితరులు పాల్గొన్నారు.