హనుమకొండ, మే 21 : రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కార్మిక సంక్షేమ మాసోత్సవంలో భాగంగా హనుమకొండ జిల్లా ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనాన్ని కలెక్టరేట్లోని టీఎన్జీవో భవన్లో ఆదివారం సాయంత్రం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా చీఫ్విప్తోపాటు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా చీఫ్విప్ మాట్లాడుతూ ఎక్కడా లేనివిధంగా కార్మికుల సంక్షేమం కోసం మే నెల మొత్తాన్ని ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్మికుల అభివృద్ధికి ఉద్యోగుల తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతోనే కార్మిక సంక్షేమ ఉద్యోగుల సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులకు సంబంధించి కడిపికొండ స్థల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చీఫ్ విప్ హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్కు ఉద్యోగులపై ప్రత్యేకమైన అభిమానం ఉందని వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారన్నారు.
అనంతరం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించిన కడిపికొండ స్థలం విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిషరిస్తామని తెలిపారు. మలిదశ ఉద్యమంలో వరంగల్ జిల్లా ఉద్యోగులు కీలక పాత్ర పోషించారన్నారు. మళ్లీ తెలంగాణ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, ఉద్యోగులకు ఇక ముందు ఎలాంటి సమస్యలు ఉండవన్నారు. ప్రభుత్వం తీసుకునే చర్యలతో ప్రభుత్వ రాబడి పెరుగుతున్నదన్నారు.
టీఎన్జీవో హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రి కేసీఆర్తో నడిచామన్నారు. టీజీవో జిల్లా అధ్యక్షుడు అన్నమనేని జగన్మోహన్ రావు మాట్లాడుతూ చీఫ్విప్ వినయ్భాస్కర్ కడిపికొండ స్థలానికి సంబంధించిన సమస్యను పరిష్కరిస్తారనే నమ్మకం ఉందన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా టీఎన్జీవో నాయకులు గజ్జెల రామ్ కిషన్, బూరుగు రవి, నాగరాజు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దాస్య నాయక్, హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు లక్ష్మణ్ రావు, పెన్షనర్ల సంఘం బాధ్యులు గోవర్ధన్, యూనివర్సిటీ ఉద్యోగ సంఘాల నేత డాక్టర్ పుల్ల శ్రీనివాస్, ఉద్యోగ సంఘాల నాయకులు పుల్లూరు వేణుగోపాల్, పనికేల రాజేశ్, డాక్టర్ ప్రవీణ్కుమార్, ఫణికుమార్, రాజేశ్, శ్యామ్ సుందర్, సారంగపాణి, పావని, రజిత, శ్రీలత, సలీం, రామ్ ప్రసాద్, సురేశ్, రాజేశ్ఖన్నా, లక్ష్మీప్రసాద్, రాజీవ్, అనూప్, ప్రణయ్, పృథ్వీ, శ్రీనివాస్, గౌతమ్, రామాంజనేయులు, పైడి రాజు తదితరులు పాల్గొన్నారు.