హనుమకొండ, జూలై 4 : ప్రభుత్వ ప్రాధాన్య లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పంచాయతీరాజ్ ఈఈలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ్ర మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సీఎస్ శాంతికుమారి సూచన ప్రకారం ఐటీడీఏ ద్వారా పోడుభూముల పట్టా పంపిణీ కార్యక్రమాన్ని సత్వరమే జిల్లాలో ఎరువులు, విత్తనాల కొరత రాకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు. నూతన పట్టాదారుల బ్యాంకు వివరాలు సేకరించి అప్డేట్ చేయాలన్నారు. ప్రతి నెల లక్ష్యాలను నిర్దేశించుకుని చేరుకోవాలని ఆదేశించారు. తెలంగాణకు హరితహారంలో భాగంగా గ్రామాలవారీగా మొకలు నాటేందుకు ఉపాధి హామీ పథకం కింద ఫిట్టింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. మొకల సంరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి అవెన్యూ ప్లాంటేషన్ మొకకు ట్రీగార్డ్ ఏర్పాటు చేయాలని, నాటిన ప్రతిమొక లెక పకాగా ఉండేందుకు జియో ట్యాగింగ్ చేయాలన్నారు. బీసీ కులవృత్తుల వారికి ప్రభుత్వం నిర్దేశించిన రూ.లక్ష ఆర్థిక సాయం దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హుల ఎంపిక పారదర్శకంగా ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. బీసీ వృత్తిదారుల దరఖాస్తుల పరిశీలన అర్హుల ఎంపిక ప్రక్రియ యుద్ధప్రాతిపదికన పూర్తి కావాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలోని వైకుంఠ ధామాల్లో కరెంట్ సౌకర్యం తప్పనిసరిగా ఉండాలన్నారు. వచ్చే సోమవారం నాటికి పూర్తి స్థాయిలో ప్రగతి సాధించాలన్నారు. ప్రగతి పనులను సంబంధిత ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పంచాయతీరాజ్ ఈఈలు ప్రత్యేక శ్రద్ధతో సకాలంలో పూర్తి చేయాలన్నారు. మిషన్ భగీరథ ద్వారా మండలంలోని గ్రామాల్లో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నందున మంచినీటి బోరు వేయించడానికి ఎంపీడీవోలు శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి, డీఎఫ్వో జే వసంత, డీఆర్డీవో ఎ.శ్రీనివాస్కుమార్, డీపీవో వీ జగదీశ్ పాల్గొన్నారు.