వరంగల్ : ఇందిరానగర్తో నాకు 30 ఏళ్ల అనుబంధం ఉందని, రాజకీయలకు అతీతంగా ఇక్కడి ప్రజలతో మమేకమయ్యానని, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. పేద ప్రజల కోసమే ఇందిరానగర్లో ప్రత్యేక కమ్యూనిటీ హాల్ నిర్మించామన్నారు. సొంత నగదుతో లైట్లు ఫ్యాన్లు, కుర్చీలు, ఫంక్షనల్ సామగ్రిని కూడా అందించినట్లు ఆయన తెలిపారు. ఖాళీ స్థలాలు కలిగి ఉన్న వారందరికి కూడా గృహలక్ష్మి కింద మూడు లక్షలు నగదు సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.
మహిళల కోసం ప్రత్యేక టైలరింగ్ కార్యక్రమాన్ని సైతం నిర్వహిస్తామని, టెక్ట్స్టైల్స్ పార్కులో ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ వ్యాప్తంగా 19 మంది పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు డాక్టర్ చదువుకు ఎంపికయ్యారని తెలిపారు. ఎంబీబీఎస్ చదివేందుకు ఎంపికైన పేద విద్యార్థులకు నా వంతుగా 20వేల ఆర్థిక సాయం ఇప్పటికే వారికి అందించినట్లు వివరించారు.
నియోజకవర్గంలో ఉన్న వారి విద్య, వైద్యానికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. స్థానిక దర్గా డివిజన్లోని ప్రజల వైద్య ఖర్చుల నిమిత్తం సీఎంఆర్ఎఫ్ కింద 148 మందికి సాయం చేసినట్లు వివరించారు. ఎన్నికల సందర్భంగా మాయదారి మాటలతో ఎంతోమంది వస్తారని వాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. గతంలోనూ, రాబోయే రోజుల్లోనూ నేను మీ కుటుంబ సభ్యుడిగా నేను ఒకడిగా మీ మంచి చెడుల్లో అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్రాజు యాదవ్, గ్రంథాయల చైర్మన్ అజీజ్ ఖాన్, 48వ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు హరినాథ్, శ్రీకాంత్, పాల్గొన్నారు.