ఎర్రుపాలెం, ఆగష్టు11 : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని పలు గ్రామాల్లో మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు బుధవారం పర్యటించి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, ఇటీవల మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గుంటుపల్లి గోపవరానికి చెందిన మందడపు వెంకటేశ్వరరావు, భీమవరం గ్రామానికి చెందిన శీలం నాగిరెడ్డి, భవానీపురానికి చెందిన కొండపల్లి రాఘవరావు, బనిగండ్లపాడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జంగా పుల్లారెడ్డి ఇటీవల అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న నేపథ్యంలో వారి స్వగృహాలకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఎర్రుపాలెం మండలానికి చెందిన న్యాయవాది, సీనియర్ పాత్రికేయుడు గంధం శ్రీనివాసరావు తల్లి శకుంతల ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అలాగే రాజులదేవరపాడు గ్రామానికి చెందిన వేమిరెడ్డి పెద్ద శివారెడ్డి ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి, సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి యన్నం శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ వేల్పుల బెంజిమెన్, మండల నాయకులు శేగిరెడ్డి శ్రీకాంత్రెడ్డి, గూడూరు రమణారెడ్డి, కోట శ్రీనివాసరావు, సంక్రాంతి కృష్ణారావు, అనుమోలు సాంబశివరావు,షేక్ మస్తాన్ వలి, షేక్ బహదూర్ ఖాన్,గద్దల శ్రీనివాసరావు, రవి, కృష్ణారెడ్డి,వెంకటరెడ్డి, మందడపు నరేష్,లక్కిరెడ్డి అప్పిరెడ్డి, వేమిరెడ్డి పూర్ణ, నాగేశ్వరరావు బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.