– మున్సిపల్ సిబ్బంది భూక్య జైత్రంకు తీవ్ర గాయాలు
కొత్తగూడెం టౌన్, ఆగస్టు 11 : సుజాతనగర్ మండల పరిధిలోని 23వ డివిజన్లో గల మంగపేటలో బుధవారం వీధిలైట్లు మారుస్తుండగా కరెంట్ షాక్ తగిలి మున్సిపల్ సిబ్బంది భూక్య జైత్రం తీవ్ర గాయాలపాలయ్యాడు. తలకి తీవ్ర గాయమై రక్తస్రావం జరుగుతున్న జైత్రంను హుటాహుటిన స్థానిక కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో, మెరుగైన వైద్యం కోసం వైద్యులు ఖమ్మం తరలించాలని సూచించారు. జైత్రం గతంలో మంగపేట ఉప సర్పంచ్గా పని చేశాడు. ప్రస్తుతం కొత్తగూడెం మున్సిపల్ పరిధిలో మల్టీ పర్పస్ వర్కర్ గా డివిజన్లో పనులను నిర్వర్తిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.