HomeWarangal-ruralGovernment Chief Whip Dasyam Vinaybhaskar Said That The Government Under Cm Kcr Is Working Towards Health Telangana
ఆరోగ్య తెలంగాణ లక్ష్యం
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని సర్కారు కృషి చేస్తున్నదని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హనుమకొండ అంబేదర్ భవన్లో వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా చీఫ్ విప్ దాస్యం హాజరయ్యారు.
సీఎం కేసీఆర్ కృషితో హెల్త్ హబ్గా వరంగల్
ప్రతి జిల్లాకు వైద్య కళాశాల ఏర్పాటు చేసిన ఘనత ఆయనదే
కొవిడ్ సమయంలో వైద్యులు, సిబ్బంది సేవలు మరువలేనివి
ఉత్తమ సేవలందించిన వైద్య సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేత
గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని సర్కారు కృషి చేస్తున్నదని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హనుమకొండ అంబేదర్ భవన్లో వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా చీఫ్ విప్ దాస్యం హాజరయ్యారు. అంతకుముందు వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను ప్రారంభించారు. అనంతరం వినయ్భాస్కర్ మాట్లాడుతూ పేదలకు ఉచిత వైద్యం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. సీఎం కేసీఆర్ కృషితో వరంగల్ హెల్త్ హబ్గా రూపుదిద్దుకుంటోందని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన ఘనత ఆయనదేనన్నారు. కొవిడ్ సమయంలో వైద్యులు, సిబ్బంది చేసిన సేవలు మరువలేనివన్నారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉండేందుకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ప్రవేశపెట్టారని చెప్పారు. ఈ సందర్భం గా ఉత్తమ సేవలందించిన వైద్యారోగ్య సిబ్బందికి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు.
– నయీంనగర్, జూన్14
నయీంనగర్, జూన్ 14 : ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హనుమకొండ అంబేదర్ భవన్లో తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ను ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదవారికి ఉచిత వైద్యం అందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు. సీఎం కేసీఆర్ కృషితో వరంగల్ హెల్త్ హబ్గా రూపుదిద్దుకుంటున్నదని, 24 అంతస్తులతో 2వేల పడకలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశామని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. కొవిడ్ సమయంలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది చేసిన సేవలు మరువలేనిదని, తల్లీబిడ్డ క్షేమంగా ఉండేందుకు ఈ రోజు ప్రత్యేకంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ప్రవేశపెట్టారని తెలిపారు. 108, 102, 104 ప్రత్యేక అంబులెన్స్ సర్వీసులను తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం నడిపిస్తున్నదన్నారు.
హైదరాబాద్ నలువైపులా నాలుగు నిమ్స్ వైద్యశాలలను తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నదని, పట్టణాల్లో ఉన్న పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందించేందుకు బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పల్లె దవాఖానలను ఏర్పాటు చేశారన్నారు. టీ డయాగ్నస్టిక్స్ ద్వారా 54 రకాల ఉచిత వైద్య పరీక్షలు చేయస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా 102 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశారని చెప్పారు. నాలుగు కోట్ల మంతికి కంటి వెలుగు ద్వారా పరీక్షలు చేశారని, పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి వరమని తెలిపారు. అనంతరం రూ.33,71,600 విలువైన 46 సీఎంఆర్ఎఫ్ చెకులు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ప్రతిభ కనబరిచిన వైద్య శాఖ సిబ్బందికి జ్ఞాపికలను అందజేసి సన్మానించారు. వైద్యులు ఆరోగ్యశాఖ సిబ్బందికి సర్టిఫికెట్లు, జ్ఞాపికలను అందజేశారు. అనంతరం కేసీఆర్ కిట్టు, సీఎం రిలీఫ్ ఫండ్, ఆరోగ్యశ్రీ సేవలు పొందినవారు కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
హనుమకొండ చౌరస్తా : ఆరోగ్య తెలంగాణకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి దవాఖాన (జీఎంహెచ్)లో పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎకడా లేనివిధంగా వైద్య ఆరోగ్య విభాగంలో విశిష్ట పథకాలను అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రభుత్వ వైద్యశాలల్లో పడకల సంఖ్య దాదాపు 17 వేలు ఉంటే ఇప్పుడు పడకల సంఖ్య సుమారు 60 వేలకు చేరిందని చెప్పారు. ఇది తెలంగాణ ప్రభుత్వ ఘనత అని అన్నారు.
ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలను పెంచేందుకు కేసీఆర్ కిట్ను ప్రవేశపెట్టి ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగ బిడ్డ పుడితే రూ.12 వేలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని తెలిపారు. అమ్మ ఒడి, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ద్వారా ప్రతి బాలింతకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ సాంబశివరావు, జీఎంహెచ్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి, ఆర్ఎంవో సారంగం, డాక్టర్ భార్గవ్ పాల్గొన్నారు.