మహదేవపూర్ (కాళేశ్వరం), సెప్టెంబర్ 3: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబటిపల్లిలోని లక్ష్మీ(మేడిగడ్డ) బరాజ్కు వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా మంగళవారం ఇన్ఫ్లో 6,21,840 క్యూసెక్కులకు రాగా, బుధవారం 8,03,370 క్యూసెక్కులకు పెరిగింది. బరాజ్లోని మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.
బరాజ్ వద్ద ప్రస్తుత వరద ప్రవాహం బరాజ్ రివర్ బెడ్ నుంచి సముద్ర మట్టానికి 96.20 మీటర్ల ఎత్తులో ఉందని, వరద మరింత పెరిగే అవకాశం ఉందని భారీ నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. కాళేశ్వరం వద్ద గోదావరి నది ప్రవాహం సుమారు 8.5 మీటర్ల ఎత్తులో ఉందని అధికారులు తెలిపారు. వరద పెరిగిన నేపథ్యంలో లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు.