కాశీబుగ్గ, ఫిబ్రవరి 19: వరంగల్లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు ఐదు రోజులు సెలవు ప్రకటించినట్లు కార్యదర్శి క్యారం సంగయ్య తెలిపారు. మేడారం జాతరను పురస్కరించుకొని చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, గుమస్తా, హమాలీ, దడువాయిల అభ్యర్థన మేరకు ఈ నెల 21 నుంచి 23 వరకు సెలవు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
శనివారం వారాంతపు యార్డు బంద్, ఆదివారం వారాంతపు సెలవు అని తెలిపారు. 26 నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు యథావిధిగా కొనసాగుతాయని తెలియజేశారు. రైతులు సెలవు రోజుల్లో మార్కెట్కు వ్యవసాయ ఉత్పత్తులు తీసుకురావద్దని కోరారు.