మహబూబాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ధాన్యం సేకరణ జోరుగా సాగుతున్నది. నవంబర్ నెలలో కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభించారు. ఇందుకోసం ఐకేపీ ఆధ్వర్యంలో 64, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 149, జీసీసీ 9, మెప్మా 2, ఏఎంసీ ఒకటి, డీహెచ్ఎస్వో మూడు మొత్తం 228 కేంద్రాల ద్వారా కొనుగోళ్లను ప్రారంభించారు. వీటి ద్వారా ఇప్పటివరకు 1,32,348 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఇందులో 19,525 మెట్రిక్ టన్నుల ‘ఏ’ గ్రేడ్ ధాన్యం, 1,12,823 మెట్రిక్ టన్నుల కామన్ రకం ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మొత్తం 23,132 మంది రైతుల నుంచి రూ. 270.38 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించారు.
ఇందులో 17,385 రైతుల 87,001 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన వివరాలు ఆన్లైన్లో నమోదు చేశారు. ఇందులో 13,101 మంది రైతులకు రూ.134.69 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. అంటే ఆన్లైన్లో నమోదు చేసి వివరాల ప్రకారం 75.76శాతం రైతులకు చెల్లింపులు చేశారు. మిగిలిన 24.24శాతం డబ్బులు నాలుగైదు రోజుల్లో జమ కానున్నాయి. కాగా, జిల్లాలో 228 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే 25 కేంద్రాలు మూసివేయగా, ప్రస్తుతం 203 కొనుగోలు కేంద్రాల ద్వారా అధికారులు ధాన్యాన్ని సేకరిస్తున్నారు.
జిల్లాలో ఇప్పటి వరకు 23,132 మంది రైతుల నుంచి 1,32,348 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో 64 ఐకేపీ కేంద్రాల ద్వారా 6,164 మంది రైతుల నుంచి 33,403 మెట్రిక్ టన్నులు, 149 పీఏసీఎస్ కేంద్రాల ద్వారా 15,967మంది రైతుల నుంచి 94,095 మెట్రిక్ టన్నులు, 9 జీసీసీ కేంద్రాల ద్వారా 422మంది రైతుల నుంచి 2,373 మెట్రిక్ టన్నులు, ఒక ఏఎంసీ ద్వారా 16 మంది రైతుల నుంచి 70 మెట్రిక్ టన్నులు, రెండు మెప్మా కేంద్రాల ద్వారా 344మంది రైతుల నుంచి 1,447 మెట్రిక్ టన్నులు, మూడు డీహెచ్ఎస్వో కేంద్రాల ద్వారా 219 మంది రైతుల నుంచి 959 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 23,132 మంది రైతుల నుంచి 1,32,348 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా మొత్తం వీటి విలువ రూ.270.38కోట్లు.
రూ.270.38 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేశాం
జిల్లాలోని 18 మండలాల్లో 228 కొనుగోలు కేం ద్రాలు ఏర్పాటు చేశాం. ఇందులో 25 కేంద్రాలను మూసివేశాం. ప్రస్తుతం 203 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేస్తున్నాం. ఇప్పటి వరకు 23,132 మంది రైతు ల నుంచి వడ్లు కొనుగోలు చేశాం. ఇందులో 17,385 మంది రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేశాం. 13,101 మంది రైతులకు 65,896 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి రూ.134.69 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం. మిగతా రైతులకు నాలుగైదు రోజుల్లో డబ్బులు జమ చేస్తాం.
– పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ కృష్ణవేణి