వానకాలం పంటలకు రెడీ అవుతున్న రైతులు
దుక్కులు దున్ని, నారుమళ్లను సిద్ధం చేసే పనిలో నిమగ్నం
ప్రణాళిక సిద్ధం చేసిన జిల్లా యంత్రాంగం
అందుబాటులో విత్తనాలు, ఎరువులు
ఈఏడాది 4,60,580 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయనున్నట్లు అధికారుల అంచనా
వానకాలం సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. దుక్కులు దున్ని, నారుమళ్లు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఏడాది 4,60,580 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసి విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచారు. జిల్లాలో వడ్లు-54,100 క్వింటాళ్లు, పత్తి-261 క్వింటాళ్లు, మక్కజొన్న- 2,81,200 ప్యాకెట్లు, కందులు- 610 క్వింటాళ్లు, పెసర్లు-332 క్వింటాళ్లు, వేరుశనగ-482 క్వింటాళ్లు, 650, పసుపు 480, ఇతర విత్తనాలు 650 క్వింటాళ్లు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే జిల్లాకు చేరుకున్న విత్తనాలను మండలాల వారీగా కేటాయించి తరలిస్తున్నారు. కాగా, భూసారం కోసం తొలకరి చినుకులు పడగానే చల్లుకునేందుకు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై జీలుగ, జనుము విత్తనాలు అందిస్తున్నది.
మహబూబాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): వానకాలం సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. దుక్కులు దున్ని, నారుమళ్లను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను రైతులకు అందుబాటులో ఉన్నాయి. వ్యవసాయశాఖ అంచనా ప్రకారం ఈఏడాది వరి-1,80,200 ఎకరాలు, పెసర్లు-8,284, కందులు 12,036, వేరుశనగ- 610, మిర్చి 65,200, పసుపు- 4,620 ఎకరాలు, మక్కజొన్నలు – 32,630, పత్తి-1,40,600,ఇతర పంటలు- 16,400 ఎకరాల్లో సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు విత్తనాలు, ఎరువులను అందుబాటు లో ఉంచారు. జిల్లాలో వడ్లు-54,100 క్వింటాళ్లు, పత్తి-261 క్వింటాళ్లు, మక్కజొన్న- 2,81,200 ప్యాకెట్లు, కందులు-610 క్వింటాళ్లు, పెసర్లు-332 క్వింటాళ్లు, వేరుశనగ-482 క్వింటాళ్లు, 650, పసుపు 480, ఇత ర విత్తనాలు 650 క్వింటాళ్లు సిద్ధం చేశారు. ఇందుకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసిన జిల్లా యంత్రాంగం విత్తనాలను సిద్ధం చేసి, టార్గెట్ ప్రకారం మండల కేంద్రాలకు పంపించారు.
జిల్లా వ్యాప్తంగా 2021లో 4,51,812 ఎకరాల్లో రైతులు పంటలను సాగు చేశారు. ఈ ఏడాది 4,60,580 ఎకరాల్లో సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. గతేడాదితో పోలిస్తే 8,768 ఎకరాల్లో అధికంగా సాగు చేయనున్నారు. గతేడాది వరి-2,14,34 2 ఎకరాల్లో సాగు చేయగా, ఈ ఏడాది 1,80,200 ఎకరాల్లో సాగు కానున్నది. అదేవిధంగా భూసారం పెరిగి అధిక దిగుబడి కోసం తొలకరి చినుకులు పడగానే చెలకలు, పొలాల్లో చల్లుకునేందుకు జీలుగ, జనుము విత్తనాలను రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై అందిస్తున్నది. ఇవి కావాల్సిన వారు రైతు పాస్బుక్, ఆధార్కార్డు తీసుకొని వెళ్తే ఆగ్రోస్, పీఏసీఎస్లలో అందిస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు వచ్చిన విత్తనాలను మండలాల వారీగా కేటాయించి తరలిస్తున్నారు. ఈ ఏడాది కొన్ని పంటల సాగును తగ్గించగా, మరికొన్ని పంటల సాగు పెరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
రైతులకు అందుబాటులో విత్తనాలు
జిల్లాలో మండలాల వారీగా కేటాయించిన కోటా ప్రకారం విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నాయి. ఎక్కడా ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో విత్తనపు వడ్లు, పత్తి, మక్కజొన్న, కందులు, పెసర్లు, వేరుశనగ, పసుపు తదితర విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఏడాది పంటలకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసి, టార్గెట్ ప్రకారం విత్తనాలను మండల కేంద్రాలకు కేటాయిస్తున్నాం.
– ఛత్రూనాయక్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి