జనగామ రూరల్, ఏప్రిల్10: బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూడండి.. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి గత ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పనులు పరిశీలించండి.. అమలుకాని హామీలతో ప్రజల ను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రె స్ పాలనను గమనించండి.. పార్లమెంట్ ఎన్నికల్లో అభివృద్ధికే పట్టం కట్టండి..’ అని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జనగామ మండలం పసరమడ్ల శివారులోని ఉషోదయ కన్వెన్షన్లో బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించా రు. స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేశ్, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ గిరబోయిన భాగ్యలక్ష్మి, యాదవ సంఘం రాష్ట్ర నాయకుడు బక్క నాగరాజు యాదవ్, జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాల్దె సిద్ధిలింగం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలకులు వాటి అమలులో విఫలమయ్యారని విమర్శించారు. పదేళ్లలో ఎన్నడూ ఎండిపోని పంటలు సీఎం రేవంత్రెడ్డి పాలనలో ఎండిపోతున్నాయని తెలిపారు. రిజర్వాయర్లలో నీళ్లున్నా సాగునీరు అందించడం లేదని, చెరువులు, కుంటలు నింపకపోవడంతో పంటలు ఎండిపోయి, పెట్టుబడి రాక రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు రైతుబంధు సాయం, పంట నష్టపరిహారం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని పల్లా రాజేశ్వర్రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపి వేసిందన్నారు.
సాగునీరందక పంటలు ఎండిపోతుంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పొలంబాట పట్టి రైతులను పరామర్శించేందుకు తొలిసారి జనగామ, సూర్యాపేట జిల్లాలకు వచ్చారని ఎమ్మెల్యే పల్లా తెలిపా రు. కేసీఆర్ పర్యటన తర్వాతే నాగార్జునసాగర్ నుంచి నీటిని విడుదల చేశారని గుర్తు చేశారు. అదనుకు ముందే చెరువులు, కాల్వలకు నీటిని విడుద ల చేస్తే పంటలు ఎండిపోయేవి కావన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో క్యామ మల్లేశ్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. ఇక్కడ పోటీ పడుతున్న కొందరు అభ్యర్థులు ఫోర్జరీ, స్మగ్లింగ్, డ్రగ్స్ కేసుల్లో దొరికిన వారు ఉన్నారని పేర్కొన్నారు. తమ హయాంలో జనగామ అభివృద్ధికి నిధులు కేటాయిస్తే కాంగ్రెస్ నాయకులు తమ గొప్పగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. జనగామ ప్రాంతం తెలంగాణ సాయుధ పోరాట గడ్డ అని, ఇక్కడ ప్రజల కోసం పనిచేసే నాయకులను ప్రజ లు ఎన్నుకున్నారని పల్లా వివరించారు.
సామాన్య గొర్రెల కాపరుల కుటుంబం నుంచి వచ్చిన తనకు బీఆర్ఎస్ నుంచి భువనగిరి ఎంపీ అభ్యర్థిగా ఉద్యమ నేత కేసీఆర్ టికెట్ ఇచ్చారు. 35 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న తాను రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా, ఇబ్రహీంపట్నం మార్కెట్ చైర్మన్గా పనిచేశానని, గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా డబ్బులకు అమ్ముడుపోయిన టీ-పీసీసీ నేతలు వేరే వ్యక్తికి అవకాశం ఇచ్చారు. ఈ క్రమం లో నా సేవలను గుర్తించిన కేసీఆర్ స్వయంగా పిలిచి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. భువనగిరి ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. ఇటీవల జరిగిన సభలో సీఎం రేవంత్రెడ్డి ఉద్యమ నేత, మాజీ సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్లో కష్టపడుతున్న కార్యకర్తలకు పదవులు ఇవ్వకుంటే సీఎం రేవంత్రెడ్డి అంగీలాగు ఊడపీకేందుకు సిద్ధంగా ఉన్నారు. అన్ని సామాజిక వర్గాలకు టికెట్ల కేటాయింపులో బీఆర్ఎస్ ప్రాధాన్యం ఇచ్చింది. కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు ఇవ్వకున్నా నాటి సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 15 మంది బీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంతో కొట్లాడుతాం. గ్రామాల అభివృద్ధికి నిరంతరం పాటుపడుతాం. కార్యకర్తలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తాం.
కేసీఆర్ పాలనలో అభివృద్ధి ఎలా ఉంది. నేటి కాంగ్రెస్ పాలన ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలి. ఎన్నికల సమయంలో అమలు కాని హామీలిచ్చి కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది. మొన్నటిదాకా చెరువులు, కుంటలు, కాల్వల ద్వారా గోదావరి జలాలు అందేవి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎండిన పొలాలు, చెరువులు, కుంటలు కనిపిస్తున్నయి. ఇక్కడి ఎమ్మెల్యే పల్లాకు ప్రభుత్వం నిధులు కేటాయించకున్నా సొంత నిధులతో జనగామను అభివృద్ధి చేస్తారు. ఎంపీ ఆభ్యర్థి క్యామ మల్లేశ్ అందరివాడు. పిలిస్తే పలికే మల్లేశ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి.
సీఎం రేవంత్రెడ్డి తన కొడంగల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ. 6 వేల కోట్లు కేటాయించినట్లు ఆయనే చెప్పారు. కానీ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉన్నాయని వారికి గుర్తుండాలి. అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి పాటుపడాలి. తెలంగాణ కోసం పోరాటం చేసిన కేసీఆర్ వెంటే ఉండాలని నేను బీఆర్ఎస్లో చేరా. గోదావరి నదిలో నీళ్లున్నా దేవాదుల ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోయలేదు. దీంతో 90 రోజుల్లో తుపాకులగూడెం బ్యారేజీ నుంచి 48 టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది. పంటలు ఎండిపోతుంటే ఎక్కడ ఉన్నరు. రైతులను పరామర్శించే తీరిక సీఎంకు లేదా?. కరువు వస్తే కేసీఆర్ పాలన వల్లే అంటున్నరు. మరి మీరు ఏం చేస్తున్నరు. పాలన ఆయనకే అప్పగించండి.
కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో కరెంట్ కోతలు మొదలైన య్. దీంతో ఇన్వర్టర్, బ్యాటరీలను తయారు చేసే ఫ్యాక్టరీలు ప్రా రంభమైనయ్. గతంలో రైతులు కరెంట్ వద్దనేలా వచ్చేది. ఇప్పు డు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. గతంలో ఎండని పంటలు ఇప్పుడు ఎందుకు ఎండిపోతున్నా యో ప్రజలు అర్థం చేసుకోవాలి. గ్రామాల్లో సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు కాదు 420 హామీలు ఇచ్చింది. వాటిని అమలు చేయాలి. ఎంపీ అభ్యర్థి క్యామ
కార్యక్రమంలో ఎంపీపీలు మేకల కళింగరాజు, బద్దిపడిగె కృష్ణారెడ్డి, జడ్పీటీసీలు శ్రీనివా స్, పద్మజ, బండ యాదగిరి, మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్, రైతుబంధు సమితి జిల్లా మాజీ కోఆర్డినేటర్ ఇర్రి రమణారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు బాల్దె సిద్ధిలింగం, గాడిపల్లి ప్రేమలతారెడ్డి, బండ పద్మ, నాయకులు పసుల ఎబెల్, బక్క నాగరాజు యాదవ్, గద్దల నర్సింగరావు, ఇమ్మడి శ్రీనివాస్రెడ్డి, సేవెల్లి సంపత్, బాలనర్సయ్య, అంకుగారి శ్రీధర్ రెడ్డి, కనకయ్య, బైరగోని యాదగిరి గౌడ్, బొడిగం చంద్రారెడ్డి, మల్లేశం, గంగం సతీశ్రెడ్డి, బొల్లం శారద, కందుకూరి ప్రభాకర్, చందు, తాడేం రాజేశ్వరి, చెంచారపు పల్లవి, ధర్మపురి శ్రీనివాస్, మాజిద్, ఉల్లెంగుల సందీప్ పాల్గొన్నారు.