కాశీబుగ్గ, జనవరి 20: ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని వర్థన్నపేట ఎమ్మెల్యే, వ రంగల్ జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆరూరి రమేశ్ పిలుపునిచ్చారు. శుక్రవారం గ్రేటర్ వరంగల్లోని 3వ డివిజన్ పైడిపల్లిలో రెండో రోజూ ఏర్పా టు చేసిన ‘కంటి వెలుగు’ కేంద్రాన్ని ఆయన సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల అభివృద్ధే సీఎం కేసీఆర్ ధ్యే యమన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అనంతరం కంటి పరీక్షలు చేయించుకున్న వారికి అద్దాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జన్ను షీభారాణీఅనిల్, డివిజన్ అధ్యక్షుడు ఎన్ రాజు, నాయకులు బుద్దె వెంకన్న, మంతుర్తి కుమార్యాదవ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
వర్ధన్నపేటలో..
వర్ధన్నపేట : ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ‘కంటి వెలుగు’ను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ ఆంగోత్ అరుణ సూచించారు. వర్ధన్నపేట పట్టణంలోని 3వ వార్డులో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ఆమె శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం పేదలు, వృద్ధుల కోసం కంటి వెలుగు శిబిరాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ము న్సిపల్ వైస్ చైర్మన్ ఎలెందర్రెడ్డి, వార్డు కౌన్సిలర్, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
నెక్కొండలో..
నెక్కొండ: రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ను విజయవంతం చేయాలని వరంగల్ డీఎంహెచ్వో వెంకటరమణ సూచించారు. మండలం అలంకానిపేటలో ‘కంటి వెలుగు’ కేంద్రాన్ని డీఎంహెచ్వో, ఆప్తలామిక్ అధికారి ప్రసాద్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని సూచించారు. అలాగే పీహెచ్సీల్లో రోజువారీ ఆరోగ్య కార్యక్రమాలను నిర్లక్ష్యం చేయకూడదన్నారు. వైద్యాధికారి అరుణ్కుమార్, వైద్యుడు జైపాల్రెడ్డి, సూపర్వైజర్లు రాజు, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
ఖానాపురంలో..
ఖానాపురం: ‘కంటి వెలుగు’పై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ సిబ్బందికి సూచించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఖానపురం, ధర్మరావుపేట గ్రామాల్లో కొనసాగుతున్న ‘కంటి వెలుగు’ కేంద్రాలను పరిశీలించారు. మండల వైద్యాధికారి భూపేశ్, కల్పన, రుచిత, సూపర్వైజర్ రామలింగయ్య, యాకస్వా మి, భాస్కర్, బద్రునాయక్, సునిత, సుజాత, ప్రతిభ, విజయ, సబిత, పద్మ పాల్గొన్నారు.
ఖిలావరంగల్లో..
ఖిలావరంగల్: కంటి పరీక్షలు చేయించుకోవాలని వైద్యాధికారి ఎస్ రవీందర్ సూచించారు. పడమర కోటలోని పద్మశాలీ కమ్యూనిటీ భవనంలో రెండో రోజూ ‘కంటి వెలుగు’ కొనసాగింది. కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కంటి పరీక్షలకు వచ్చే వారు ఆధార్ కార్డును వెంట తీసుకొచ్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
దుగ్గొండిలో..
దుగ్గొండి: ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య సూచించారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పకడ్బందీగా ప్రారంభించిన రెండో విడుత ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని మండలంలోని కేశవాపురం, దుగ్గొండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వరంగల్ జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, స్థానిక ఎంపీపీ స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. మండల వ్యాఫ్తంగా రెండు పీహెచ్సీలో ఎర్పాటు చేసిన కంటి పరీక్షా శిబిరాలో 280 మందికి పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు పంపిణీ చేశారు. వైద్యాధికారులు కిరణ్రాజు, పవన్కుమార్, విజయ్కుమార్, సాంభయ్య, రాజు, వైద్యురాలు వనమాల పాల్గొన్నారు.
సంగెంలో..
సంగెం: మండలంలోని రెండో విడుత ‘కంటి వెలుగు’ కార్యక్రమం రెండో రోజు విజయవంతం గా కొనసాగింది. సంగెం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం తో పాటు గవిచర్ల గ్రామంలో ‘కంటి వెలుగు’ నిర్వహించారు. గురువారం నిర్వహించిన వైద్య శిబిరంలో ఓపీ 276 కాగా, అందులో 61 మందికి కంటి అద్దాలు అందజేసినట్లు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి అశోక్ శుక్రవారం తెలిపారు.
చెన్నారావుపేటలో..
చెన్నారావుపేట: మండల కేంద్రంలోని ‘కంటి వెలుగు’ కేంద్రాన్ని వరంగల్ డీఎంహెచ్వో వెంకటరమణ, అప్తలామిక్ అధికారి ప్రసాద్ శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని సూచించారు. అలాగే రోజువారి ఆరోగ్య కార్యక్రమాలను నిర్లక్ష్యం చేయకూడదన్నారు. వైద్యాధికారులు సరోజన, సుమన్, వైద్యులు భరత్ కుమార్, ప్రసూన, పృథ్వీరాజ్, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
గీసుగొండలో..
గీసుగొండ: ‘కంటి వెలుగు’ ద్వారా ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని జిల్లా ‘కంటి వెలుగు’ ప్రత్యేకాధికారి పద్మశ్రీ అన్నారు. మండల కేంద్రంతో పాటు వంచనగిరి, మొగిలిచెర్లలో ‘కంటి వెలుగు’ కార్యక్రమాలను శుక్రవారం ఆమె పరిశీలించి, వైద్యులు సూచనలు చేశారు. కంటి సమస్యతో బాధపడుతున్న వారందరికీ పరీక్షలు చేస్తామన్నారు. వైద్యాధికారి మాధవీలత తదితరులు పాల్గొన్నారు.