జనగామ, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : జనగామను జిల్లా చేసి, గోదావరి నీటితో సస్యశ్యా మలంగా చేసిన సీఎం కేసీఆర్కు ఘన స్వాగతం పలకాలని ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛందంగా బహిరంగసభకు తరలిరావాలని కోరారు. శనివారం జనగామ బీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్ టి.రాజయ్య, బీఆర్ఎ స్ జనగామ అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 16న జనగామలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ వివరాలను వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ను, బీఆర్ఎస్ ప్రభు త్వాన్ని కాపాడుకునేందుకు మహిళలు, రైతులు, యు వత, పెన్షనర్లు జనగామకు తరలివస్తున్నారని చెప్పారు. సభ కోసం నాయకులు ప్రజలతో కలిసి రావాలని, ప్రజల మధ్య ఉండాలని, ప్రజల సౌకర్యాలను చూడా లని కోరారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతున్న మొదటి ఎన్నికల సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరిలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ‘కేసీఆర్ దయతోనే జనగామ జిల్లా అయింది. అభి వృద్ధిలో ముందు వరసలో ఉంది. ఇంకా అభివృద్ధి చేసే బాధ్యత మాది’ అని స్పష్టం చేశారు. మిషన్ భగీరథ, దేవాదుల ద్వారా జనగామకు పుష్కలంగా తాగు, సాగునీరు లభిస్తున్నదంటే అది సీఎం కేసీఆర్ కృషి ఫలితమేనన్నారు. కేంద్రం చిన్నచూపు చూసినా తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ వన్ అయిందని, గుజరాత్ను మంచిపోయిందని, సాగునీరు, పంటలు, కరంట్, ఐటీ పరిశ్రమల్లో అగ్రగామిగా నిలిచిందని బీజేపీ కేంద్ర మంత్రులే చెప్పారని గుర్తుచేశారు.
రేవంత్ ఓ బ్రోకర్..చీటర్..
‘రేవంత్ ఓ బ్రోకర్..చీటర్..పైసలకు అమ్ముడు బోయే క్యారెక్టర్ లేని నువ్వెంత..? నీ బతుకెంత..పెద్ద చదువులు చదివి అమెరికాలో మంచి కంపెనీలో ఉద్యోగం చేసిన వ్యక్తిని అవమానిస్తావా? కేటీఆర్పై మాట్లాడే అర్హత నీకుందా?!..జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకో’ అంటూ పీసీసీ చీఫ్పై మంత్రి ఎర్రబెల్లి మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అని..డబ్బులకు టికెట్లు అమ్మకుంటున్నాడని వాళ్ల పార్టీ నేతలే అంటుంటే ఇంకా సిగ్గు లేకుండా మాట్లా డుతున్నావా? అని ప్రశ్నించారు. ‘నీలా మాకు రోత మాటలు రావు..నువ్వు తిమ్మిని బమ్మి చేస్తావ్.. నువ్వు, నీ బతుకు గురించి ఆలోచించు, నీ కుటుంబ మేంది? నీ బతుకేంది?’ అని ఎర్రబెల్లి భగ్గుమన్నారు. ‘ఏడాదికోసారి పార్టీ మారే బతుకు నీది..కొడంగల్లో చిత్తుగా ఓడిపోయినోడివి.. దమ్ముంటే రంగారెడ్డి జిల్లాలో పోటీచేసి గెలువు’ అని సవాల్ చేశారు. రేవంత్ రాగానే కాంగ్రెస్ పని ఖతమైందని, ఆ పార్టీ గ్రాఫ్ ఘోరంగా పడిపోయిందని, 15న బీఆర్ఎస్ మేనిఫెస్టోతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖతమవు తందన్నారు. ‘ప్రజలు కాంగ్రెస్ను నమ్మే పరిస్థితిలో లేరు.. పక రాష్ర్టాల్లో 6 గ్యారెంటీలు ఇయ్యని మీరు ఇకడ ఇస్తా అంటే ఎట్ల నమ్ముతరు..? ఒకప్పుడు గిరి జన గూడేలను గ్రామ పంచాయతీలు చేస్తాం, రిజ ర్వేషన్లు పెంచుతాం అని చెప్పిన వైఎస్ రాజశేఖర్రెడ్డి ఏ ఒకటీ చేయలేదు’ అని గుర్తుచేశారు.
పొన్నాల రాకను స్వాగతిస్తున్నాం..
సీనియర్ నాయకుడు.. బీసీ నేత పొన్నాల లక్ష్మ య్య జనగామకు ఎంతో కొంత సేవ చేశారని, ఐదు పార్టీలు మార్చిన రేవంత్రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చి పొ న్నాల వంటి మహానేతను తిట్టడం సిగ్గుచేటని, అంత పెద్ద మనిషిని పట్టుకొని అలా మాట్లాడడం బా ధాకర మని, రేవంత్ మాటలను ఖండిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. రేవంత్ రాజకీయ విలువలను దిగజా రుస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘40 సంవత్స రాలుగా పొన్నాల కాంగ్రెస్ను పట్టుకొని ఉన్నడు.. పదేండ్ల కష్టకాలంలో నమ్ముకొని పనిచేసిన చరిత్ర లక్ష్మయ్యది.. నువ్వు పార్టీలోకి మధ్యలో వచ్చి దందా లు చేసినోడివి..రెండుసార్లు నువ్వు ఓడిపోతే మళ్లీ టికెట్ తీసుకోలేదా?..ఆయన అడిగితే తప్పేంటి’ అని ప్రశ్నించారు. పొన్నాల బీఆర్ఎస్లోకి వస్తానంటే ఆ యన ఇంటికి వెళ్లి ఘనంగా స్వాగతిస్తామని చెప్పారు.
సభకు భారీగా తరలిరండి..
పల్లా రాజేశ్వర్రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రాజ య్య మాట్లాడుతూ ఎడారిగా ఉన్న జనగామ కేసీఆర్ నాయకత్వంలో ఇప్పుడు ఆకుపచ్చగా మారిందని, తెలంగాణ వస్తే ఏం వస్తుందన్న వారికి గతానికి, ఇప్ప టికి బేరీజు వేసుకుంటే అర్థమవుతుందన్నారు. సీఎం కేసీఆర్ సభకు ప్రజలను తీసుకువచ్చే నాయకులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, వాళ్లను తిరిగి ఇళ్లలో దిగబెట్టే వరకు బాధ్యత వహించాలని కోరారు. అంత కు ముందుకు మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యేలు, అభ్యర్థి పల్లా కలిసి హెలిప్యాడ్, బహిరంగసభా వేదిక వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. వీరివెంట మార్కెట్ చైర్మన్ బాల్దె సిద్ధిలింగం, మున్సిపల్ చైర్మన్ పోకల జమున, కొమురవెల్లి ఆలయ మాజీ చైర్మన్ సేవెల్లి సంపత్, జడ్పీటీసీ నిమ్మతి దీపిక, పీఏసీఎస్ చైర్మన్ నిమ్మతి మహేందర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు జల్లి సిద్ధయ్య, బండ యాదగిరిరెడ్డి, ఏబెల్, కందుకూరి ప్రభాకర్, లెనిన్, శారద పాల్గొన్నారు.