గిర్మాజీపేట, ఫిబ్రవరి 24: జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న కంటివెలుగు శిబిరాలకు విశేష ఆదరణ లభిస్తున్నదని డీఎంహెచ్వో కాజీపేట వెంకటరమణ అన్నారు. కంటివెలుగు కార్యక్రమం ప్రారంభమై నాటి నుంచి శుక్రవారం వరకు 1,74,520 మందికి నేత్ర పరీక్షలు చేసినట్లు తెలిపారు. 30,136 మందికి రీడింగ్ గ్లాసులు అందించగా, 18,652 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసుల కోసం ఆర్డర్ చేశామన్నారు. ఇప్పటివరకు 2,884 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసులు అందించినట్లు డీఎంహెచ్వో వెల్లడించారు. జిల్లాలో 82 జీపీలు, 19 వార్డుల్లో నేత్ర పరీక్షలు పూర్తి కాగా, 25 జీపీలు, 19 వార్డుల్లో త్వరలోనే కంప్లీట్ చేస్తామని చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 81,776 మంది పురుషులు, 92,729 మంది మహిళలు, 42 మంది ట్రాన్స్జెండర్లకు నేత్ర పరీక్షలు చేసినట్లు చెప్పారు. ఇందులో 27,073 ఎస్సీలు, 17,439 ఎస్టీలు, 1,17,345 బీసీలు, 7,649 ఓసీలు, 5,013 మైనార్టీలు, 40 ఏండ్లలోపు 3,968 మంది, 40 ఏండ్ల పైబడిన 26,167 మందికి పరీక్షలు పూర్తి చేశామని డీఎంహెచ్వో చెప్పారు. ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల్లో 1,25,732 మందికి ఎలాంటి కంటి సమస్యలు లేవని వెల్లడించారు.
ఖిలావరంగల్: యావత్ దేశం తెలంగాణ వైపు చూసేలా రాష్ట్రంలో అంధత్వ నివారణే లక్ష్యంగా నేత్ర వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలు రుణపడి ఉండాలని కేయూ జాక్ చైర్మన్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కత్తెరపల్లి దామోదర్ అన్నారు. వరంగల్ 17వ డివిజన్లోని గాడిపల్లిలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఆయన వైద్యాధికారి డాక్టర్ కే మౌనికతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్ సుష్మా, వసంత, నెల్లుట్ల కుమారస్వామి, పసునూరి వీరస్వామి, భాస్కర్, రమేశ్, యాదగిరి, సాంబయ్య పాల్గొన్నారు.
నర్సంపేటరూరల్: కంటివెలుగు కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఎంపీడీవో ఓరుగంటి ఇంద్రసేనారెడ్డి, ఎంపీవో అంబటి సునీల్కుమార్రాజ్ అన్నారు. ముగ్దుంపురం, నాగుర్లపల్లిలో కంటివెలుగు శిబిరాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి సూచనలు చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారులు బానాల అరుణ్చంద్ర, కల్యాణి, సర్పంచ్లు పెండ్యాల జ్యోతి, కందికొండ రజిత, హెచ్ఈవో సంజీవరావు, ఆప్తాల్మిక్ ఆఫీసర్లు స్వాతి, జ్యోత్స్న, హెల్ ్తఅసిస్టెంట్ సంజయ్కుమార్, లక్ష్మణ్, మల్లారెడ్డి, మాధవరావు, అనిత, స్రవంతి పాల్గొన్నారు.
పర్వతగిరి: ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, ప్రజల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని ఎంపీపీ కమల పంతులు అన్నారు. గోపనపెల్లిలో కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. కంటి సమస్యల నివారణ కోసం సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. అనంతరం వైద్య బృందం ఆధ్వర్యంలో ప్రజలకు నేత్ర పరీక్షలు చేసి కళ్లద్దాలు అందించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్రావు, సర్పంచ్ పంజా మహేశ్, ఎంపీటీసీ సూర రమేశ్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు సర్వర్, ఉపసర్పంచ్ సూర అశోక్, ఉపాధ్యాయులు, వైద్యాధికారి, అంగన్వాడీ సిబ్బంది, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.