నర్సంపేట, డిసెంబర్ 24 : సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ అని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. శనివారం క్యాంపు కార్యాలయంలో 108 మందికి కల్యాణలక్ష్మి, 50 మందికి రూ.18 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదింటి యువతులకు సీఎం కేసీఆర్ మేనమామలా కల్యాణలక్ష్మి చెక్కులను అందిస్తున్నారని తెలిపారు. దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన బొంత కొమురమ్మ కవల పిల్లలు రమ, లలిత వివాహం ఏప్రిల్లో జరిగిందని, వీరిద్దకి ఒకేసారి కల్యాణలక్ష్మి చెక్కులు అందించడంతో ఆ తల్లి మురిసి పోయిందన్నారు. వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేని ఎన్నో కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆసరాగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స చేయించుకున్న వారు బిల్లులతో పాటు దరఖాస్తులను క్యాంపు కార్యాలయంలో ఇస్తే సీఎంఆర్ఎఫ్ వచ్చేలా చూస్తానన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్ రామ్మూర్తి పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరిక..
నల్లబెల్లి : మండలంలోని ముచ్చింపులలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. ఆ పార్టీ సీనియర్ నాయకుడు కక్కెర్ల సురేశ్కు బీఆర్ఎస్లో చేరగా, అతడికి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ ఊడుగుల ప్రవీణ్గౌడ్, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్గౌడ్, సర్పంచ్లు బొట్ల సువర్ణ, చీకటి ప్రకాశ్, ఊరటి అమరేందర్, లావుడ్యా తిరుపతి, గ్రామ అధ్యక్షుడు కృష్ణ, కార్యదర్శి సాంబయ్య, మోహన్, కుమారస్వామి, సురేశ్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.