మడికొండ, ఏప్రిల్ 12 : పేదింటికి వరం కల్యాణ లక్ష్మి పథకం అని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ 64వ డివిజన్ టేకులగూడెం గ్రామంలో బుధవారం ఆయన లబ్ధిదారుల ఇళ్లుకు వెళ్లి రూ. 3లక్షల 87వేల 732 విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఆవాల రాధికారెడ్డి, నాయకులు పోలెపల్లి రామ్మూర్తి, దువ్వ శ్రీకాంత్, దువ్వ నవీన్, నాగరాజు పాల్గొన్నారు.
హసన్పర్తి : గ్రేటర్ వరంగల్ 65వ డివిజన్ సుబ్బయ్యపల్లి గ్రామంలో దుర్గమ్మ ఆలయ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే అరూరి రమేశ్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని వర్గాలకు సీఎం కేసీఆర్ సమ ప్రాధాన్యం కల్పిస్తున్నారని చెప్పారు. దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం అమ్మవారికి బోనం సమర్పించారు.