ఖిలావరంగల్, జనవరి 2: వైకుంఠ ఏకాదశి వేడుకలు జిల్లాలో అత్యంత వైభవంగా జరిగాయి. రంగు రంగుల విద్యుత్ దీపాలు, పుష్పాల అలంకరణతో ఆలయాలు దేదీప్యమానంగా వెలిగిపోతూ ఆధ్యాత్మిక శోభతో కళకళలాడాయి. పవిత్ర పర్వదినం కావడంతో భక్తులు తమ దైవాన్ని దర్శించుకునేందుకు వేకువజాము నుంచే దేవాలయాలు బా టపట్టారు. మంగళ వాయిద్యాల మధ్య తెరుచుకున్న ఉత్తర ద్వారం నుంచి ఆలయ ప్రవేశం కోసం భక్త జనం బారులు తీరారు. అలాగే ప్రధాన ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు నిర్వహించారు. శివనగర్లోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శంచుకునేందుకు తరలివచ్చారు. అన్ని వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
గిర్మాజీపేటలో..
గిర్మాజీపేట : వైకుంఠ ఏకాదశి సందర్భంగా పలు ఆలయాల్లో సందడి నెలకొంది. సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తమ ఇష్టదైవాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వరంగల్ పట్టణంలోని బట్టలబజార్లోని వేంకటేశ్వరాలయంలో ఈవో వై రత్నాకర్రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అర్చకుడు శాస్ర్తోక్తంగా వైకుంఠద్వారం తెరిచారు. అభిషేకం, అర్చన, అలంకరణ అనంతరం ఉత్తర ద్వారం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఉదయ మే స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నా రు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ సిబ్బంది వీరన్న, లక్ష్మి పాల్గొన్నారు.
వరంగల్ చౌరస్తాలో..
వరంగల్ చౌరస్తా : గోవిందరాజుల స్వామి ఆలయంలో ప్రధానార్చకుడు శ్రీనివాసస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఉత్తర ద్వారం గుండా దర్శనానికి అనుతించారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ అనువంశీయ అర్చకులు పాల్గొన్నారు.
గీసుగొండలో..
గీసుగొండ: కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంతో పాటు ఏలుకుర్తి శివాలయం, మండల కేంద్రంలోని శివాలయం, గొర్రెకుంట కట్టమల్లన్న ఆలయం, కీర్తినగర్ కాలనీలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలను అర్చకులు ఘనంగా నిర్వహించారు. కొమ్మాల ఈవో శేషగిరి. అర్చకులు రామాచార్యులు, విష్ణు, ఫణింద్రాచార్యులు, శ్రీఅభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు యాదగిరి,ఎల్లయ్య, ఉప్పలయ్య,రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
కరీమాబాద్లో..
కరీమాబాద్: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం అండర్ రైల్వేగేట్ ప్రాం తంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంగశాయిపేటలోని రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 42వ డివిజన్ కార్పొరేటర్ గుండు చందన, గుండు పూర్ణచందర్, భక్తులు పాల్గొన్నారు.
నర్సంపేట రూరల్లో..
నర్సంపేట రూరల్: నర్సంపేట పట్టణంలోని ద్వారకపేట, గురిజాల గ్రామంలోని శ్రీరామలింగేశ్వర ఆలయాల్లో భక్తులు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకున్నారు. దేవస్థాన ఆవరణలో స్వామి వారి పల్లకీసేవ కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా నర్సంపేట ఆర్డీవో శ్రీనివాసులు, ఏసీపీ సంపత్రావు, తహసీల్దార్ వాసం రామ్మూర్తితో పాటు మున్సిఫల్ వైస్ చైర్మన్ సతీమణి మునిగాల పద్మ, మాజీ ఎంపీపీ నల్లా మనోహర్రెడ్డి దంపతులు, పట్టణ ప్రముఖ వ్యాపారవేత్తలు నంగునూరి వినోద్రావు, శ్రీరాం ఈశ్వరయ్య, మాదారపు చంద్రశేఖర్, కొడకండ్ల నాగేశ్వర్రావు, గంధం నరేందర్, చకిలం కృష్ణమూర్తి, రాంనారాయణ, కౌన్సిలర్లు రామసహాయం శ్రీదేవి, మినుముల రాజు వేంకటేశ్వరస్వామికి ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అదేవిధంగా ఆయా ఆలయాల్లో భక్తు లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్ధం ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఆరుట్ర వెంకటాచార్యులు, శ్రీధరాచార్యులు, అదేవిధంగా మండలంలోని గురిజాల గ్రామ శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయంలో అభిషేకాలు, పూజలు, అర్చనలు విశేషంగా జరిగాయి. ఎంపీటీసీ బండారు శ్రీలత-రమేశ్ దంపతులతో పాటు గ్రామ ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు ఉన్నారు.
నర్సంపేటలో..
నర్సంపేట: నర్సంపేటలోని వేంకటేశ్వరాలయం లో వైకుంఠ ఏకదాశి పూజలు భక్తులు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ ఎర్ర జగన్మోహన్రెడ్డి, ఊర్మిళ ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వేంశెట్టి శ్రీనివాస్, శింగిరికొండ రవీందర్, రామగోని సుధాకర్, చింతల నిరంజన్, బాల్నె సర్వేశం, నల్ల మనోహర్రెడ్డి,నాగిశెట్టి ప్రసా ద్, వడ్డె చిరంజీవి, దాసరి మల్లారెడ్డి, పాలాయి రవి, మల్యాల సదానందం పాల్గొన్నారు.
ఖానాపురంలో..
ఖానాపురం: ఖానాపురం సీతారామచంద్రస్వా మి ఆలయంలో నిర్వహించిన ఉత్తర ద్వార దర్శనం పూజల్లో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, ఆలయ కమిటీ చైర్మన్ గొల్లపూడి సుబ్బారావు, గీతాంజలి విద్యాసంస్థల చైర్మన్ వేములపల్లి సుబ్బారావు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తర ద్వార దర్శనం పూజలతో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి.
వర్ధన్నపేటలో..
వర్ధన్నపేట: మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయంతో పాటుగా, ఇల్లంద చా రిత్రక రామలింగేశ్వర, లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు.
దుగ్గొండిలో..
దుగ్గొండి: మండలంలోని నాచినపల్లి సీతారామచంద్రస్వామి, కేశవాపురంలోని వేంకటేశ్వరాలయంలో ముక్కోటి వేడుకలు ఘనం గా జరిగా యి. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. గోవులకు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామాల సర్పంచ్లు, ఆలయాల చైర్మన్లు పాల్గొన్నారు.
చెన్నారావుపేటలో..
చెన్నారావుపేట: చెన్నారావుపేట మండల కేం ద్రంలోని సిద్ధేశ్వర ఆలయంలో ఘనంగా ము క్కోటి ఏకాదశి వేడుకలను నిర్వహించారు. సిద్ధ్దేశ్వర ఆలయంలో భక్తులు స్వామివారిని దర్శ నం చేసుకుని, ప్రత్యేక పూజలు చేశారు.
రాయపర్తి: ముక్కోటి ఏకాదశి నేపథ్యంలో మండలంలోని ప్రముఖ దేవాలయమైన సన్నూ రు స్వయం వ్యక్త వేంకటేశ్వరస్వామి ఆలయంతో పాటు మండలకేంద్రంలోని సీతారామచంద్ర స్వామి ఆలయంలో స్వామివార్లు ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాయపర్తి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఎస్సై రాజు దంపతులు, గ్రామ సర్పంచ్ గారె నర్సయ్యతో పాటు బీఆర్ఎస్ జిల్లా నాయకుడు బిల్ల సుధీర్రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పర్వతగిరిలో..
పర్వతగిరి: మండలంలోని కల్లెడ శ్రీభూదేవి, శ్రీదేవి సమేత శ్రీకొలను వేంకటేశ్వరస్వా మి వారి గుడిలో అర్చకులు, నిర్వహకులు ప్రత్యే క ఏర్పాట్లు చేసి, వేడుకలు ఏకాదశి వేడుకలు నిర్వహించారు జమాల్పురం సోమారం సాయిబాబా దేవాలయంలో అర్చకుడు రమణాచారి నేతృత్వంలో అభిషేకం, అర్చన కార్యక్రమాలు వేడుకగా నిర్వహించారు.