గీసుగొండ, మార్చి 25 : మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతరకు భక్తులు పోటెత్తారు. హోలీ వేడుకల అనంతరం స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు ఎడ్లబండ్లు, ప్రైవేట్ వాహనాల్లో తరలివచ్చారు. ఒంటె, ఏనుగు, గుర్రం, మేక తదితర ప్రభ బండ్లను అందంగా ముస్తాబు చేసి కోలాటాలు, లంబాడీ నృత్యాల నడుమ భక్తులు స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు సోమవారం రాత్రి స్వామి వారికి పూర్ణాహుతి ఇతర ప్రత్యేక పూజ లు చేశారు. ఆలయం చుట్టూ భక్తి ప్రభలు తిరిగే ఘట్టం అత్యంత వైభవంగా జరిగింది. భక్తుల గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాంతమంతా మర్మోగింది. దర్శనం అనంతరం భక్తులు వంటలు చేసుకుని భోజనాలు చేసి తిరుగు ప్రయాణమయ్యారు. వరంగల్-నర్సంపేట మార్గంలో ఎడ్లబండ్ల సందడి కనిపించింది. రద్దీ దృష్ట్యా తిరుగు ప్రయాణంలో భక్తులు సూర్యతండా మీదుగా వెళ్లేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మామునూరు ఏసీపీ తిరుపతి ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కాగా, లోక్ సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని రాజకీ య ప్రభలు కట్టొద్దని పోలీసులు హెచ్చరించినా కొంద రు నాయకులు రాజకీయ ప్రభలను కట్టి హల్చల్ చేశా రు. ఒక్కో రాజకీయ ప్రభ వెనుక 200 మంది కార్యకర్తలు డీజే సౌండ్స్ పెట్టి కాంగ్రెస్ నాయకులు సంబురా లు చేసుకున్నారు. కోడ్ అమల్లో ఉండడంతో బీఆర్ఎస్ నాయకులు రాజకీయ ప్రభ బండ్లు కట్టడం విరమించుకున్నారు.