చెన్నారావుపేట, మార్చి 1: గ్రామాల అభివృద్ధే తెలంగాణ సర్కారు ప్రధాన ధ్యేయమని సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కుండె మల్లయ్య అన్నారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సహకారంతో మంజూరైన రూ. 5 లక్షల నిధులతో మండలకేంద్రంలోని ఏడో వార్డులో సూర కొమ్మాలు ఇంటి నుంచి చెక్క కొమ్మాలు ఇంటి వరకు 120 మీటర్ల మేర చేపట్టిన సీసీరోడ్డు నిర్మాణ పనులను మంగళవారం సర్పంచ్ ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో గ్రామాల్లో కనీస వసతులు లేక ప్రజలు నానా అవస్థలు పడేవారన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని బంగారుతెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ పల్లెల్లో అనేక వసతులు కల్పిస్తున్నారని కొనియాడారు. ప్రతి వీధిలో సీసీరోడ్డు నిర్మించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ రఫీ, మాజీ జడ్పీటీసీ జున్నూతుల రాంరెడ్డి, వార్డు సభ్యులు రాసమల్ల సతీశ్, బండి ఉపేందర్, గొడిశాల సురేందర్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కందకట్ల సాంబయ్య, గ్రామ కో ఆప్షన్ సభ్యుడు కోరె కుమారస్వామి, టీఆర్ఎస్ నాయకులు గట్ల రాంబాబు, కుసుమ నరేందర్, బొంత సారయ్య పాల్గొన్నారు. అనంతరం మండలకేంద్రంలో జరుగుతున్న సీసీరోడ్ల నిర్మాణ పనులు, వాటి నాణ్యతను పంచాయతీరాజ్ శాఖ డీఈ అజయ్కుమార్ పరిశీలించారు. కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. నిరంతరం అధికారుల పర్యవేక్షణ ఉండాలని కోరారు. ఆయన వెంట వర్క్ ఇన్స్పెక్టర్ రఘు, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కందకట్ల సాంబయ్య, నాయకుడు కంది కృష్ణచైతన్యారెడ్డి, మాజీ ఎంపీటీసీ మాదాసి కుమారస్వామి ఉన్నారు.
ఖానాపురం: గ్రామాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని సర్పంచ్ వెన్ను శ్రుతి అన్నారు. ధర్మారావుపేటలో రూ. 5 లక్షలతో చేపట్టిన సీసీరోడ్డు పనులను సర్పంచ్ ప్రారంభించారు. గత ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయని కొనియాడారు. రాబోయే రోజుల్లో గ్రామాల్లో వందశాతం సీసీరోడ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పూర్ణచందర్, మేకల కుమారస్వామి, నవీన్ పాల్గొన్నారు.