నర్సంపేటరూరల్, నవంబర్ 2: తనను మరోసారి ఆశీర్వదిస్తే నర్సంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం భాంజీపేటలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన 40 కుటుంబాలు సుదర్శన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. డివిజన్ ప్రజలు కారుగుర్తుకు ఓటు వేసి కేసీఆర్ సర్కారుకు హ్యాట్రిక్ విజయం అందించాలని కోరారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధిని కార్యకర్తలు ప్రజలకు వివరించాలని సూచించారు. బీఆర్ఎస్ జనరంజక పాలనపై ప్రజల్లో చర్చ పెట్టాలన్నారు. గ్రామానికి చెందిన అజ్మీరా లింగమ్మ, పిట్టల సరస్వతి, ఎలకంటి వరలక్ష్మి, కంకణాల అరుణ, వాంకుడోత్ బుజ్జమ్మ, వాంకుడోత్ భద్రమ్మ, బానోత్ శారద, మేకల గౌరవమ్మ, బైర పుష్పలీల, ఆరెల్లి వెంకటలక్ష్మి, అజ్మీరా మారమ్మ, అజ్మీరా జానకమ్మ, అజ్మీరా సమ్మక్క, కొండ సరిత, అజ్మీరా అర్జీ, మాలోత్ సమ్మక్క, అజ్మీరా నర్సయ్య, అజ్మీరా రాజు, పిట్టల వంశీ, పిట్టల సురేందర్, రాగుల సిద్దూ, రాగుల కరుణాకర్రెడ్డి, భీమగాని శ్రీకాంత్, భూషబోయిన అఖిల్, పుట్టపాక రవి, భూషబోయిన సునీల్, భూషబోయిన తిరుపతి, భూషబోయిన శ్రీను, భూషబోయిన సాంబరాజు, భూషబోయిన గణేశ్, పత్తిపాక లక్ష్మణాచారి, భీమగాని భరత్, పిండి శ్రీనాథ్, మాట్ల రమేశ్తోపాటు మరికొంత మంది బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, ఆర్బీఎస్ మండల కన్వీనర్ మోతె జయపాల్రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కొడారి రవన్న, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు భూక్యా వీరన్న, క్లస్టర్ ఇన్చార్జీలు మచ్చిక నర్సయ్యగౌడ్, మోతె పద్మనాభరెడ్డి, కోమాండ్ల గోపాల్రెడ్డి, కడారి కుమారస్వామి, తాళ్లపెల్లి రాంప్రసాద్, కట్ల సుదర్శన్రెడ్డి పాల్గొన్నారు. అలాగే, గురిజాలకు చెందిన ఆరె లక్ష్మీనర్సు, జకమల్ల నర్సింగం, కూనమల్ల అనిల్, కూనమల్ల కిరణ్, రామకృష్ణతోపాటు మరో ఐదుగురు పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో సర్పంచ్ గొడిశాల మమత-సదానందంగౌడ్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు చిన్నపెల్లి నర్సింగం, ఆర్బీఎస్ గ్రామ కన్వీనర్ అన్న కోమల-రాజమల్లు, పార్టీ మండల ఉపాధ్యక్షుడు అల్లి రవి, నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా మహేశ్వరం గ్రామానికి చెందిన మాజీ కమ్యూనిస్టు మోతె వీరారెడ్డి పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
నర్సంపేట/చెన్నారావుపేట: బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ముందు కాంగ్రెస్, బీజేపీ బేజారు అవుతున్నాయని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. నర్సంపేటలో పెద్ది సమక్షంలో దుగ్గొండి మండలం రేబల్లె గ్రామానికి చెందిన బీజేపీ దళిత మోర్చా మండల అధ్యక్షుడు తిక్క సుభాష్ ఆధ్వర్యంలో కొన్ని కుటుంబాలు బీఆర్ఎస్లో చేరాయి. నర్సంపేటలో జరిగిన అభివృద్ధిని చూసిన తర్వాతే ప్రజలు మళ్లీ తనకు మద్దతు తెలుపుతున్నారని పెద్ది అన్నారు. బీజేపీ దళిత మోర్చా నాయకులు తిక్క మహేశ్, కత్తి కోటేశ్, తడుగుల శ్రీరామ్ బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నం మొగిలి, మాజీ సర్పంచ్ మేరుగు రాంబాబు, సొసైటీ డైరెక్టర్ జర్పుల శ్రీను, నాయకులు దామోర శ్రీను, మహేందర్ పాల్గొన్నారు. అలాగే, చెన్నారావుపేట మండలంలోని పాపయ్యపేటకు చెందిన పలువురు కాంగ్రెస్, ఎంసీపీఐ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు బుర్ర సుదర్శన్గౌడ్, ఎంపీటీసీ కేవవరెడ్డి, సొసైటీ డైరెక్టర్ మజ్జిగ రాంబాబు, క్లస్టర్ బాధ్యులు బద్దూనాయక్, యూత్ నాయకులు పాల్గొన్నారు.
నల్లబెల్లి: బీఆర్ఎస్ సర్కారు అందిస్తున్న సుస్థిర పాలనకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు సముచిత స్థానం కల్పించాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కోరారు. మేడెపల్లి, బుచ్చిరెడ్డిపల్లె, గుండ్లపహాడ్, నందిగామ, గోవిందాపూర్, కొండాపూర్, బుచ్చిరెడ్డిపల్లె గ్రామాల నుంచి బీజేపీ, కాంగ్రెస్, టీడీపీకి చెందిన 150 కుటుంబాలు సుదర్శన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిలో ఎంతో వెనుకబడిన తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. నర్సంపేట నియోజకవర్గానికి గోదావరి జలాలను తీసుకొచ్చి సస్యశ్యామలం చేసినట్లు వివరించారు. కన్నారావుపేటకు హార్టికల్చర్ రీసోర్స్ సెంటర్ను మంజూరు చేయించినట్లు వెల్లడించారు. పార్టీలో చేరిన వారిలో బీజేపీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు బచ్చు వెంకటేశ్వర్లు, మేడెపల్లి గ్రామ అధ్యక్షుడు పెరుమాండ్ల సాయిప్రకాశ్, మైనార్టీ మోర్చా అధ్యక్షుడు ఎండీ ఇసాక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సట్ల మధుసూదన్, అర్రం ప్రభాకర్, కాంతయ్య, తడుక రాజు, అనిల్, బోడ వీరేందర్, మంద రాజు, సాయిరాం, రామచెంద్రయ్య, కృష్ణమూర్తి, న్యూడెమోక్రసీ కార్యకర్త సోనబోయిన రవి, కూస రామచంద్రు, కుంజ పగడయ్య, నరేశ్, యాకయ్య, ఎస్కే సత్తర్మియా, యాకూబ్మియా, అజయ్, వీరన్న, సిరాజ్, అజ్జు, శ్రీను, భూక్యా సేత్రామ్, లచ్చుతోపాటు నందిగామకు చెందిన మున్నూరుకాపు నుంచి యువత పెద్దికి సంపూర్ణ మద్దతు తెలిపింది. వీరితోపాటు మరో 130 కుటుంబాలు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నుంచి చేరాయి. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, సర్పంచ్లు చింతపట్ల సురేశ్రావు, వెంకట్రెడ్డి, నునావత్ వెంకన్ననాయక్, పీఏసీఎస్ ఉపాధ్యక్షుడు మోహన్రావు, మాజీ సర్పంచ్ విడియాల ప్రభాకర్రావు, క్లస్టర్ ఇన్చార్జీలు హరినాథ్సింగ్, మాజీ ఎంపీటీసీ గుగులోత్ సారయ్య, ఎస్కే మసూద్, ఆజాం, సురేశ్ పాల్గొన్నారు.