Dasyam vinay bhasker | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వ్యవహారశైలిపై ఫైర్ అయ్యారు. దాస్యం వినయ్ భాస్కర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 1984లో దివంగత ఎన్టీ రామారావు మద్యపాన నిషేధం విధించినప్పుడు నీ బతుకేంది నాయిని రాజేందర్ రెడ్డి అని
మండిపడ్డారు.
ఎక్సైజ్ పోలీసులు, టాస్క్ఫోర్స్ పోలీసులు నిన్ను వెంటాడితే మా అన్న మంత్రిగా ఉన్నాడని ఆశ్రయం కోసం రాలేదా..? అని నాయిని రాజేందర్ రెడ్డిని ప్రశ్నించారు. నీ బండి దొరికింది.. నువ్వు దొరికినవ్.. తర్వాత ముచ్చట. కానీ ఆరోజు మాత్రం ఆశ్రయించింది ఎవరిని..? నీ చరిత్ర చాలా ఉన్నది. నీ చరిత్ర మరిచిపోయి ఇంకొకరి గురించి మాట్లాడితే ఖబడ్దార్ బిడ్దా అని నాయిని రాజేందర్ రెడ్డిని దాస్యం వినయ్ భాస్కర్ హెచ్చరించారు.
1994లో సీనియర్ ఎన్టీఆర్ మద్యపాన నిషేధం విధించినప్పుడు నీ బతుకేంది నాయిని రాజేందర్ రెడ్డి
పక్క రాష్ట్రాల నుండి గూడ్స్ రైలులో ప్లాస్టిక్ బాటిల్లలో మద్యం తెప్పిస్తూ దొరికితే, మా అన్న మంత్రిగా ఉన్నాడని ఆశ్రయం కోసం రాలేదా?
నీ చరిత్ర చాలా ఉంది నాయిని రాజేందర్ రెడ్డి, అది మర్చిపోయి… pic.twitter.com/8rEDPU1jzZ
— Telugu Scribe (@TeluguScribe) May 27, 2026