సంగెం, ఫిబ్రవరి 17 : సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా గురువారం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మండల కేంద్రంలోని సంగమేశ్వరాలయంలో పూజలు చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎంగా కేసీఆర్ పది కాలాల పాటు జీవించాలని ఆకాంక్షించారు. దేశంలోనే తెలంగాణ రాష్ర్టానికి ఒక గుర్తింపు తెచ్చారన్నారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, మండలాధ్యక్షుడు పసునూరి సారంగపాణి, ఎంపీపీ కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి, సర్పంచ్లు బాబు, కిశోర్యాదవ్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు పులుగు సాగర్రెడ్డి, పోతుల ప్రభాకర్, కక్కెర్ల కుమారస్వామి, సట్ల రాజు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
గీసుగొండ : సీఎం కేసీఆర్ కారణజన్ముడని ఎమ్మెల్యే చల్లా అన్నారు. మండలంలోని కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈసందర్భంగా యన మాట్లాడుతూ.. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధకుడన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, మండలాధ్యక్షుడు వీరగోని రాజ్కుమార్, కార్యదర్శి చల్లా వేణుగోపాల్రెడ్డి, సర్పంచ్లు వీరాటి కవిత, వాంకుడోత్ రజిత, బాబు, పూండ్రు జైపాల్రెడ్డి, బోడకుంట్ల ప్రకాశ్, మల్లారెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ మాధవరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ దొంగల రమేశ్, కార్పొరేటర్ గద్దె బాబు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.