కేంద్ర ప్రభుత్వం మరోసారి వంట గ్యాస్ ధర పెంచడంతో జిల్లావ్యాప్తంగా గురువారం నిరసనలు వెల్లువెత్తాయి. బీజేపీ సర్కార్ సామాన్యుడి నడ్డివిరుస్తున్నదని ప్రజలు మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్పొరేట్ శక్తులకు తొత్తుగా మారాడని మహిళలు ధ్వజమెత్తారు. వెంటనే గ్యాస్ ధర తగ్గించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టారు.
నర్సంపేట, మార్చి 2: నర్సంపేటలోని అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్, మహిళల ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్లతో నిరసన తెలిపారు. సామాన్యుల నడ్డివిరుస్తున్న బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ నర్సంపేట పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, నాయకులు నల్లా మనోహర్రెడ్డి, డాక్టర్ లెక్కల విద్యాసాగర్రెడ్డి, బండి రమేశ్, పుట్టపాక కుమారస్వామి, బీరం నాగిరెడ్డి, గోనె యువరాజు, పెండెం వెంకటేశ్వర్లు, పుల్లూరి స్వామిగౌడ్ పాల్గొన్నారు. అలాగే, మోదీ సర్కార్ కార్పొరేట్ శక్తులకు సబ్సిడీ ఇస్తూ.. పేద ప్రజలపై భారం మోపుతున్నదని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు పంజాల రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతుంటే మన దేశంలో మాత్రం కేంద్రంలోని బీజేపీ పెట్రో ధరలను విపరీతంగా పెంచుతున్నదని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు మియాపురం గోవర్ధన్, బానోత్ వీరూనాయక్, యాకూబ్, గడ్డం నాగరాజు, శైలజ, మమత, పిట్టల సతీశ్, అరుణ, యశోద పాల్గొన్నారు.
నడ్డి విరుస్తున్న కేంద్ర సర్కార్
దుగ్గొండి/చెన్నారావుపేట: సామాన్య ప్రజలపై కేంద్రం మోయలేని భారం వేస్తున్నదని జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుకినె రాజేశ్వర్రావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు దుగ్గొండి, గిర్నిబావిలో నిరసన తెలిపారు. ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, క్లస్టర్ ఇన్చార్జిలు ఊరటి మహిపాల్రెడ్డి, శంకేసి కమలాకర్, గుండెకారి రంగారావు, గొర్రె జనార్దన్రెడ్డి, యాదగిరి సుధాకర్, కూస రాజు పాల్గొన్నారు. అలాగే, చెన్నారావుపేటలో ఖాళీ సిలిండర్లతో మహిళలు, బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ పత్తినాయక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సామాన్యులకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో ఎంపీపీ విజేందర్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, అమీనాబాద్ సొసైటీ చైర్మన్ మురహరి రవి, మాజీ ఎంపీపీ జక్క అశోక్, మాజీ జడ్పీటీసీ రాంరెడ్డి, మండల యువ నాయకుడు కృష్ణచైతన్యరెడ్డి, నాయకులు బద్దూనాయక్, కందికొండ విజయ్, పార్టీ ఎస్సీసెల్ గ్రామ అధ్యక్షుడు నర్మెట్ట సాంబయ్య, పసునూరి యాకూబ్, మూడు రమేశ్, బోడ మురళీనాయక్, సాగర్, శంకర్, హైమ, రజిత పాల్గొన్నారు. అలాగే, వ్యవసాయ, కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నవీన్ల స్వామి ఆధ్వర్యంలో మండలంలోని లింగగిరి గ్రామంలో నిరసన ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం మండల ప్రధాన కార్యదర్శి మొగులోజు శారద, స్వామి, అశోక్, కట్టమ్మ, రమ, సునీత, సుమలత పాల్గొన్నారు.
గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలి
ఖానాపురం/నల్లబెల్లి: కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని కోరుతూ గురువారం బుధరావుపేటలో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో, వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య మాట్లాడుతూ సామాన్యుడి నడ్డి విరిచేలా ప్రధాని నరేంద్రమోదీ సర్కార్ గ్యాస్ ధరను పెంచుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామీనాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కుంచారపు వెంకట్రెడ్డి, సర్పంచ్ కాస ప్రవీణ్కుమార్, ఎంపీటీసీ సుభాన్బీ, మౌలానా, బీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు కుందెనపల్లి శైలజ పాల్గొన్నారు. అలాగే, నల్లబెల్లిలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు.
ఎంపీపీ ఊడుగుల సునీత ఆధ్వర్యంలో రోడ్డుపై కట్టెల పొయ్యి వెలిగించి వంట తయారు చేసి నిరసన తెలిపారు. నరేంద్రమోదీ సర్కార్ విపరీతంగా ధరలు పెంచుతూ పేదలపై మోయలేని భారం వేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బానోత్ సారంగపాణి, పీఏసీఎస్ చైర్మన్ చెట్టుపెల్లి మురళీధర్రావు, బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఊడుగుల ప్రవీణ్గౌడ్, సర్పంచ్లు ఎన్ రాజారాం, సిద్దూరి రత్నాకర్రావు, మామిండ్ల మోహన్రెడ్డి, ఊరటి అమరేందర్రెడ్డి, లావుడ్యా తిరుపతి, నాయకులు గందె శ్రీనివాస్గుప్తా, ఈ శివాజీ, నాగేశ్వర్రావు, గుగులోత్ సారయ్య, ఆర్బీఎస్ మండల కన్వీనర్ గోనెల పద్మ, నరహరి, మామిడిశెట్టి రవి, నజీమా, మండల సమాఖ్య అధ్యక్షురాలు ఊటుకూరి భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.