పర్వతగిరి, జూలై 3: బీఆర్ఎస్ పేదల ప్రభుత్వమని, నిరుపేదలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని నారాయణపురంలోని ఎస్సీకాలనీకి సంబంధించిన 70 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం గృహాల ప్రొసీడింగ్ కాపీని సోమవారం ఎమ్మెల్యే మండలకేంద్రంలో అందించారు. ఈ సందర్భంగా అరూరి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని గుర్తుచేశారు. అనంతరం డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే అరూరి రమేశ్కు లబ్ధిదారుల తరఫున సర్పంచ్ రామ్మోహన్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పట్టపురం ఏకాంతంగౌడ్, సర్పంచ్ కొత్తూరు రామ్మోహన్, నాయకులు సమ్మయ్యగౌడ్, సీత్యానాయక్ పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..
కాశీబుగ్గ/నయీంనగర్: గ్రేటర్ వరంగల్లోని 3వ డివిజన్ పైడిపల్లిలో సోమవారం ఎమ్మెల్యే అరూరి రమేశ్ నలుగురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అరూరి స్వయంగా బాధితల ఇండ్లకు వెళ్లి రూ. 2,50,000 విలువైన చెక్కులను అందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జన్ను షీభారాణి, హనుమకొండ పీఏసీఎస్ చైర్మన్ ఇట్యాల హరికృష్ణ, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు, పీఏసీఎస్ డైరెక్టర్ నేరెళ్ల రాజు, సీనియర్ నాయకులు ఎల్లావుల కుమార్యాదవ్, జన్ను అనిల్కుమార్, ఇట్యాల సతీశ్, లింగం కోటి, జన్ను సారంగపాణి పాల్గొన్నారు. అలాగే, గేటర్ వరంగల్ 45వ డివిజన్ తరాలపల్లికి చెందిన మంద తిరుపతయ్య చికిత్స కోసం సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ. 2.50 లక్షల విలువైన ఎల్వోసీని హనుమకొండ ప్రశాంత్నగర్లోని ఆయన నివాసంలో అరూరి బాధిత కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్రావు, డివిజన్ ప్రెసిడెంట్ రమేశ్, పీఏసీఎస్ చైర్మన్ ఊకంటి వనంరెడ్డి పాల్గొన్నారు.