వైద్య రంగంలో రాష్ట్రం నంబర్ వన్ అని, దేశానికి అత్యధిక సంఖ్యలో వైద్యులను అందిస్తున్న ఘనత తెలంగాణదేనని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి, ఎంపీ కవిత, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ కడియం, ఎమ్మెల్యే పెద్దితో కలిసి మంత్రి నర్సంపేటలో రూ.183కోట్లతో చేపట్టిన ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనానికి శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. తొమ్మిదేళ్లలోనే జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశామని, గతంలో రాష్ట్రంలో 2800 మెడికల్ సీట్లు ఉంటే ప్రస్తుతం 10వేల సీట్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. సీఎం కేసీఆర్ కృషితో పేద విద్యార్థులకు వైద్యవిద్య చేరువైందని, త్వరలోనే నర్సంపేటలో ఎంజీఎం దవాఖాన స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని చెప్పారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులవి మోసపూరిత వాగ్దానాలని, ప్రజలు నమ్మొద్దని కోరారు.
నర్సంపేట/నర్సంపేట రూరల్, సెప్టెంబర్ 28 : వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో ఉందని, దేశంలోనే రాష్ట్రంలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఇచ్చిన ఘనత, గొప్పతనం సీఎం కేసీఆర్దనని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం నర్సంపేట పట్టణం సర్వాపురం శివారు కొత్తగూడ ప్రధాన రహదారిలో దామెర చెరువు వద్ద రూ.183 కోట్లతో నూతనంగా నిర్మించనున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం నర్సంపేట పట్టణంలోని మార్కెట్ యార్డులో జరిగిన బహిరంగ సభకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా దారి పొడవునా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మంత్రులకు స్వాగతం పలికారు. అలాగే, మార్కెట్ ఆవరణలో జరిగిన సభలో గృహలక్ష్మి, దళిత బంధు, సబ్సిడీ వ్యవసాయ ఆధునిక పకరాలను లబ్ధిదారులకు మంత్రి హరీశ్రావు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా జిల్లాకో మెడికల్ కాలేజీ ఉన్న దాఖలాలు లేవన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ 60 ఏండ్ల పాలనలో 30 ఏళ్లకో మెడికల్ కళాశాల చొప్పున రెండు కాలేజీలు మాత్రమే ఇచ్చారన్నారు. కానీ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ 29 మెడికల్ కళాశాలలు ఇచ్చారని చెప్పారు. గతంలో రాష్ట్రంలో 2800 మెడికల్ సీట్లు ఉండేవని, ఇప్పుడు పదివేల వరకు పెరిగాయన్నారు.
జనగామ, ములుగు, మహబూబాబాద్, నర్సంపేట వంటి ప్రాంతాల్లో కూడా మెడికల్ కళాశాలలు వచ్చాయన్నారు. డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్గా నిలిచిందన్నారు. వైద్య కళాశాల వల్ల ఇప్పుడు పేదలకు 24 గంటల పాటు వైద్యం అందుబాటులోకి వస్తుందన్నారు. గతంలో వరంగల్లోని ఎంజీఎం దవాఖానపైనే ఆధారపడాల్సి వచ్చేందన్నారు. ఇప్పుడు నర్సంపేటలోనే ఎంజీఎం స్థాయి వైద్యం అందుబాటులోకి వస్తుందన్నారు. 150 మంది వైద్యులు అందుబాటులో ఉండి వైద్యం చేస్తారని చెప్పారు. ఏడాది వరకు మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులు పూర్తి చేసి, ప్రారంభిస్తామని చెప్పారు. నర్సంపేటకు మెడికల్ కళాశాల కలలో కూడా వస్తునందని ఊహించలేదన్నా రు. అలాంటిది సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో మెడికల్ కళాశాల, జిల్లా దవాఖాన మంజూరయ్యాయన్నారు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులతో లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత కూడా సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు. ధాన్యం ఉత్పత్తిలో కూడా తెలంగాణ రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచిందన్నారు. రామప్ప పాకాల, రంగాయ ప్రాజెక్టుల వల్ల నర్సంపేట ప్రాంతంలోనూ రెండు పంటలు పండుతున్నాయన్నారు. ఇదంతా సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు.మున్నేరు, పాకాల తదితర వాగులపై చెక్డ్యాంలు నిర్మించడం వల్ల 39 కిలో మీటర్ల మేరకు వాగుల్లో నీరు నిలుస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఒప్పించి నియోజకవర్గంలోని రైతులకు ఆధునిక వ్యవసాయ పరికరాలను తీసుకుని వచ్చారన్నారు. ఈ అభివృద్ధి కొనసాగాలంటే నిండు మనసుతో మళ్లీ పెద్ది సుదర్శన్రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నదని, ప్రజలు ఎట్టి పరిస్థితిలోనూ నమ్మవద్దని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రూ.600 పింఛన్ ఇస్తుంటే ఇక్కడ రూ.4వేలు ఇస్తామని చెబుతున్నారని, దీన్ని నమ్మొద్దని తెలిపారు. చాలా మంది రైతులు వ్యవసాయం చేయాలంటేనే కొన్నేళ్ల కిందట భయపడేవారన్నారు. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. భూముల విలువలు కూడా గతంతో పోల్చితే చాలా పెరిగాయన్నారు. ఇదంతా సీఎం కేసీఆర్ చలువ వల్లే సాధ్యమైందన్నారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పాకాల రంగాయ ప్రాజెక్టుతో గోదావరి జలాలను నర్సంపేట ప్రాంతానికి రప్పించారన్నారు. ఇక్కడి రైతులకు పాడి గేదెలు అందించారన్నారు. ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్లు కూడా అందించినట్లు తెలిపారు.సీఎం కేసీఆర్ను ఒప్పించి మెడికల్ కాలేజీ మంజూరు చేయించారని తెలిపారు. అయినా కాంగ్రెస్ నాయకులు సిగ్గు లేకుండా ఓట్లు అడుగుతున్నారన్నారు.
నర్సంపేటకు మెడికల్ కళాశాల రావడం గర్వకారణమని వైస్ చైర్మన్ బండా ప్రకాశ్ అన్నారు. ఇది సీఎం పట్టుదలకు నిదర్శనమన్నారు. నర్సంపేటలో ప్రగతి కనిపిస్తున్నదన్నారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డిని ప్రజలు మళ్లీ ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, మాజీ ఎంపీ సీతారాంనాయక్, కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ అశ్వినీతానాజీ వాకడే, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, జడ్పీఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామి, పారిశ్రామికవేత్త దొడ్డ మోహన్రావు, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీ-కిషన్, మున్సిపల్ కమిషనర్ నాయిని వెంకటస్వామి, మాజీ ఎంపీపీ నల్లా మనోహర్రెడ్డి, నాగెల్లి వెంకటనారాయణగౌడ్, రాయిడి రవీందర్రెడ్డి, డీఎంహెచ్వో వెంకటరమణ, ఆర్డీవో కృష్ణవేణి, డీఆర్డీవో సంపత్రావు, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ ప్రకాశ్, ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ గోపాల్, డాక్టర్ మనోజ్లాల్, తహసీల్దార్ కే విశ్వప్రసాద్, ఏడీఏ తోట శ్రీనివాసరావు, ఏసీపీ పుప్పాల తిరుమల్, నర్సంపేట టౌన్ సీఐ సుంకరి రవికుమార్, ఎస్సై శీలం రవిబహిరంగ సభ సక్సెస్ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రత్యేక కృషితో ఇటీవల మంజూరైన నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల భవన నిర్మాణ శంకుస్థాపన, బహిరంగ సభ కార్యక్రమాలు గురువారం అట్టహాసంగా జరిగాయి.
రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావుతోపాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్ల చేతుల కళాశాల శంకుస్థాపన అనంతరం నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభ సక్సెస్ అయింది. నర్సంపేట, నల్లబెల్లి, చెన్నారావుపేట, ఖానాపురం, దుగ్గొండి, నెక్కొండ మండలాల నుంచి ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు బహిరంగ సభకు భారీగా తరలివచ్చారు. అన్ని గ్రామాలు, తండాల నుంచి అధిక సంఖ్యలో హాజరయ్యారు. సభకు ప్రజలను తరలించేందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు. ఆటోలు, జీపులు, డీసీఎంలు, కార్లు, ద్విచక్రవాహనాల్లో కార్యకర్తలు తరలివచ్చి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డికి మద్దతుగా నిలిచారు. ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ జెండాలను చేతపట్టుకొని జై తెలంగాణ.. జైజై తెలంగాణ అంటూ నినదిస్తూ ర్యాలీగా సభకు తరలివచ్చారు. బహిరంగ సభకు భారీగా జనం రావడంతో నర్సంపేట బీఆర్ఎస్లో నయా జోష్ నెలకొంది. కార్యకర్తలు, నాయకులు పోటీ పడీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మంత్రులకు ఘన స్వాగతం పలికారు.
అంగన్వాడీలకు వేతనాలు పెంచింది సీఎం కేసీఆరే అని స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. 1975లో అంగన్వాడీలు ఏర్పాటయ్యాయని, అప్పటి నుంచి 2014 వరకు వారి రూ.4200 వేతనం మాత్రమే ఇచ్చేవారన్నారు. సీఎం కేసీఆర్ వచ్చాక మూడు సార్లు వారి వేతనాలు పెంచారన్నారు. ప్రస్తుతం రూ.11,850 వేతనం అందిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం వేతనాలు పెంచకున్నా రాష్ట్రమే భరించి ఇస్తున్నదని తెలిపారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.లక్ష, బీమా రూ.2లక్షలు కూడా అమలు చేస్తున్నామని చెప్పారు. త్వరలో వీరికి పీఆర్సీ వస్తుందని తెలిపారు. అయినా కొంత మంది అంగన్వాడీలు సమ్మె చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. సమ్మె విరమించాలని కోరారు. నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి అమలు చేస్తున్నారన్నారు. మళ్లీ ఎమ్మెల్యేగా పెద్ది సుదర్శన్రెడ్డిని గెలిపించుకుని అవి కొనసాగించేలా చూడాలని కోరారు.
అన్ని రంగాల్లో నర్సంపేట అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. నర్సంపేటలో తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశానన్నారు. రైతులకు ప్రత్యేక పైలట్ ప్రాజెక్టులను తీసుకొచ్చినట్లు తెలిపారు. నర్సంపేటలో రైతులకు వ్యవసాయ ఆధునిక పరికరాలను అందించేందుకు రూ.37.50కోట్ల సబ్సిడీని అందిస్తున్నామని తెలిపారు. పాకాల, రంగాయ ప్రాజెక్టులను నిర్మించి గోదావరి జలాలను నర్సంపేటకు రప్పించినట్లు తెలిపారు. రెండు పంటలకు సమృద్ధిగా సాగునీరు అందడంతో ధాన్యం ఉత్పత్తి కూడా పెరిగిందన్నారు. దీనికి అనుగుణంగా గోదాములు నిర్మించినట్లు తెలిపారు. తండాలు, మారుమూల పల్లెలకు కూడా రహదారుల సౌకర్యం కల్పించామన్నారు. నర్సంపేటకు స్పెషల్ గ్రాంట్ నిధులు, ఎస్డీఎఫ్ నిధులు వచ్చేలా సహకరించాలని మంత్రి హరీశ్రావును కోరారు. దళిత బంధు యూనిట్లు నర్సంపేట ప్రాంతానికి మరో 2వేలు వచ్చేలా చూడాలన్నారు. మాదన్నపేట మినీ ట్యాంక్ బండ్ పనులకు అప్పటి ఎమ్మెల్యే టెండర్లు వేసి, మట్టి పనులు చేసి, మిగితావి చేయనని రాసి ఇచ్చారన్నారు. ఈ చెరువునకు మిగతా నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పెద్ది కోరారు.
నర్సంపేట నియోజకవర్గంలో అభివృద్ధికి చూసి కాంగ్రెస్ పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత అన్నారు. నర్సంపేటకు మెడికల్ కళాశాల మంజూ రు చేయించడంలో ఎమ్మె ల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కృషి అభినందనీయమన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజల కోసమే ఆలోచిస్తున్న నాయకుడు పెద్ది సుదర్శన్రెడ్డి అని అన్నారు. ఆయనను ప్రజలు మళ్లీ ఆశీర్వదించాలని కోరారు.
నర్సంపేట రూరల్ : నర్సంపేటలో గురువారం రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటన కొనసాగింది. నర్సంపేట పట్టణం సర్వాపురం శివారు కొత్తగూడ ప్రధాన రహదారిలో దామెర చెరువు వద్ద రూ.183 కోట్లతో నూతనంగా నిర్మించనున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులకు వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రులకు ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీతో పాటు వివిధ శాఖల చైర్మన్లు స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాట్లాడారు. మంత్రుల పర్యటనను పురస్కరించుకొని నర్సంపేట డివిజన్ పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. ఏసీపీలు సీఐలు, ఎస్సైలు, ఏఎస్సైలు పర్యవేక్షించారు. మంత్రుల పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.