హనుమకొండ చౌరస్తా, మే 6 : బీజేపీ, కాంగ్రెస్కు దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయ ని, బీఆర్ఎస్కు మాత్రం ఒకే రాష్ట్రం… ఒకే ఎజెండా ఉన్నదని బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి మారెపల్లి సుధీర్కుమార్ అన్నారు. సోమవారం గ్రేటర్ వరంగల్ ప్రెస్క్లబ్లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్కు ఓటు అడిగే హకు లేదన్నారు. తల్లిలాంటి పార్టీని మోసం చేసిన కడియం శ్రీహరి, అరూరి రమేశ్కు వరంగల్ ప్రజలు ఓటు రూపంలో గుణపాఠం చెబుతారని, వరంగల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైందన్నారు. తాను స్థానికుడిని అని.. తన బర్త్ సర్టిఫికెట్ ఇకడే దొరుకుతుందని, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు స్థానిక సర్టిఫికెట్ ఇకడ దొరకదన్నారు. తన మీద భూ కబ్జా ఆరోపణలు లేవు అని.. అలాంటివి ముందు కూడా చేయనన్నారు. ఉమ్మడి జిల్లాలో అనేక సహ జ వనరులు ఉన్నా గతంలో ఆజంజాహీ మిల్లు, తోలు పరిశ్రమలకు మనుగడ లేకుం డా చేశారన్నారు. కాంగ్రెస్, బీజేపీ వరంగల్ ఎయిర్పోర్ట్, ఆజంజాహీ మిల్లును విధ్వం సం చేశాయన్నారు.
సింగరేణి బొగ్గుకు అధిక ధర రావడం లేదని, ఇకడ పండే వరి, మిర్చి పంటలకు ధర రాక రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. భూపాలపల్లికి రైలు మార్గం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. మామునూరు విమానాశ్రయం ఏర్పాటును అడ్డుకున్న బీజేపీ, కాంగ్రెస్లు ఇప్పుడు సింగరేణిని ప్రైవేటీకరణ చేసి పెట్టుబడిదారుల చేతి లో తెలంగాణను పెట్టాలని చూస్తున్నాయని ఆరోపించారు. 20 సంవత్సరాల నుంచి భారత రాష్ట్ర సమితిలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేశానని, ఒక చిల్లి గవ్వ కూడా అవినీతికి ఆసారం ఇవ్వలేదన్నారు. దేశంలో మోదీ పాలనపై ప్రజలు విసిగి పోయారన్నారు. మోదీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. దేశంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమని, ప్రాంతీ య పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని, వరంగల్ పార్లమెంట్పై బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తానన్నారు. ఈ సందర్భంగా వేలేరు, శాలపల్లి, లక్ష్మీతండాకు చెందిన ప్రజలు సుధీర్కుమార్ను కలిసి తమ సమస్యలను వివరించారు. సీసీ రోడ్డు వేయాలని, దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని విన్నవించారు. కార్యక్రమంలో ప్రెస్క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు వేముల నాగరాజు, బొల్లారపు సదయ్య పాల్గొన్నారు.