నర్సంపేటరూరల్, అక్టోబర్ 20: సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటుకాలపల్లికి చెందిన 15 కుటుంబాలు పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరాయి. ఈ సందర్భంగా ముత్తోజు దినేశ్, దొనికెల కిరణ్, దామెర శివ, ఆగారపు రఘు, ఆకారపు కుమార్, దొనికెల శ్యామ్, దామెర ప్రభాకర్, సంగరబోయిన రామరాజుతోపాటు మరికొంతమందికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నాయన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో నర్సంపేట నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. మరోసారి డివిజన్ ప్రజలు ఆశీర్వదిస్తే నర్సంపేటను మరింత అభివృద్ధి చేస్తానన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, సర్పంచ్ మండల రవీందర్, ఎంపీటీసీ భూక్యా వీరన్న, ఉప సర్పంచ్ జమాండ్ల చంద్రమౌళి, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్, కార్యదర్శి దొరికెల కుమార్, క్లస్టర్ బాధ్యులు కడారి కుమారస్వామి, మచ్చిక నర్సయ్యగౌడ్, వార్డు సభ్యుడు బొడిగె వినయ్, నాయకులు లకిడె రాజేశ్వర్రావు, మెడబోయిన హరీశ్ పాల్గొన్నారు.
చెన్నారావుపేట: వచ్చే ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రానుందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని పుల్లాయబోడు తండాకు చెందిన 12 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరాయి. ఈ సందర్భంగా కార్యకర్తలను పెద్ది ఆశీర్వదించారు. తెలంగాణలో అన్ని వర్గాలను అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సమ్మునాయక్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, సొసైటీ డైరెక్టర్ మజ్జిగ రాంబాబు, పార్టీ గ్రామ అధ్యక్షుడు అజ్మీరా భిక్షపతి, మాజీ ఉప సర్పంచ్ బాలాజీ పాల్గొన్నారు.