నర్సంపేట రూరల్, అక్టోబర్ 29: ప్రతిపక్షాలవి చిల్లర వేషాలని, వారు చివరి వరకు నిలబడరని, మధ్యలోనే పారిపోతారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఎద్దేవా చేశారు. పట్టణంలోని సర్వాపురంలో 4, 5, 6, 16వ వార్డుల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ నర్సంపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన తనను మరోసారి ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలన్నారు. ఎప్పటికీ ప్రజలకు అండగా ఉండేది బీఆర్ఎస్సే అన్నారు. గత ఎన్నికల్లో సర్వాపురం గ్రామం తనకు అత్యధిక మెజార్టీ అందించిందని, గ్రామ రుణం తీర్చుకోవడానికి ఇదే గ్రామ శివారులో జిల్లాస్థాయి ప్రభుత్వ దవాఖానను నిర్మిస్తున్నట్లు తెలిపారు. సర్వాపురం నేడు జిల్లా, రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు. భవిష్యత్లో కూడా ఈ గ్రామ అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొస్తాని హామీ ఇచ్చారు. నర్సంపేట వ్యవసాయ అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిందని, ధాన్యం ఉత్పత్తి పెరిగిందని, గోదాముల నిర్మాణంతోపాటు సబ్సిడీ రుణాలు, రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు లు పైలట్ ప్రాజెక్టులు తీసుకొచ్చినట్లు చెప్పారు. నర్సంపేటకు మెడికల్ కళాశాల, టీ డయాగ్నొస్టిక్ సెంటర్తోపాటు జిల్లాస్థాయి ఆస్పత్రిని తీసుకొచ్చినట్లు చెప్పారు. గతంలో తనను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపారని, ఈసారి కూడా అసెంబ్లీకి పంపిస్తే మిగిలిన పనులను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెళ్లి వెంకటనారాయణ, కౌన్సిలర్లు శీలం రాంబాబు, రామసహాయం శ్రీదేవి, వేల్పుకొండ రాజు, ముఖ్య నాయకులు గుంటి కిషన్, వేనుముద్దల శ్రీధర్రెడ్డి, మండల శ్రీనివాస్, గోనె యువరాజ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఓట్ల కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు ఓటుతో ప్రజలు బుద్ధి చెప్పాలని పెద్ది కోరారు. భాంజీపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాలను ఆపాలని కేసులు పెడుతున్న కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీయాలన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో పల్లెలకు రోడ్లు, రైతు వేదికలు, పల్లె దవాఖానలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతిపక్ష నేతలు ఐదేళ్ల నుంచి ప్రజలకు దూరంగా ఉండి ఎన్నికలు రాగానే ఓట్ల కోసం వస్తున్నారని విమర్శించారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, పార్టీ మాజీ మండల అధ్యక్షుడు మచ్చిక నర్సయ్యగౌడ్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ మోతె జయపాల్రెడ్డి, క్లస్టర్ ఇన్చార్జీలు మోతె పద్మనాభరెడ్డి, భూక్యా వీరన్న, కోమాండ్ల గోపాల్రెడ్డి, కొడారి రవన్న, కడారి కుమారస్వామి, తాళ్లపెల్లి రాంప్రసాద్, కట్ల సుదర్శన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మురాల మోహన్రెడ్డి, కందుల రాజిరెడ్డి పాల్గొన్నారు.
ఖానాపురం: బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. కొడ్తిమాట్తండాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పెద్ది మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పథకాలు రాష్ర్టానికి శ్రీరామరక్ష అన్నారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే పేదలకు మేలు జరుగుతుందన్నారు. పార్టీలో చేరిన వారిలో వార్డు సభ్యుడు గుగులోత్ శ్రీను, దేవేందర్, వీరన్న, లాలు, వెంకన్న, గోప్య, బీమ్లా, వినోద్తోపాటు మరో 30 మంది చేరారు. కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామీనాయక్, ఎంపీపీ ప్రకాశ్రావు, మండల పార్టీ అధ్యక్షుడు వెంకటనర్సయ్య పాల్గొన్నారు.