గీసుగొండ, ఫిబ్రవరి 20: కాంగ్రెస్ పార్టీలో మళ్లీ వర్గపోరు బయటపడింది. మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. దీంతో పార్టీ కార్యకర్తల్లో గందరగోళ పరిస్థితి తలెత్తింది. కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా దేశవ్యాప్తంగా ఉన్న రాజీవ్గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జిల్లాస్థాయి శిక్షణా సమావేశం గురువారం వరంగల్ జిల్లా గీసుగొండ మండలం కొమ్మాలలో నిర్వహించేందుకు నాయకులు ఏర్పాట్లు చేశారు. జాతీయ ఉపాధ్యక్షుడు కునాల్ బె నర్జీతో పాటు ఇతర రాష్ర్టాల నుంచి ప్రతినిధులు వచ్చారు.
సమావేశానికి కొద్ది నిమిషాల ముందే పోలీసులు వచ్చి అనుమతి లేదంటూ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని, లేనిపక్షంలో కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడంతో అక్క డే ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆశ్చర్యానికి గురయ్యాయి. ఇది పార్టీ సమావేశం కాదని గ్రామీణ స్థాయిలో స్వయంపాలన, ప్రజల భాగస్వామ్యం, గాంధేయవాదంపై శిక్షణ లో వివరిస్తారని ఆర్జీపీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రడం భర త్ చెప్పినా పోలీసులు వినకపోవడంతో పార్టీ రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. సొంత పార్టీ నాయకులే సమావేశాలను అడ్డుకోవడం ఏమిటని, అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే పోలీసులతో చెప్పించడంపై జాతీయ అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తామన్నారు.
వరంగల్, హనుమకొండ జిల్లా అధ్యక్షుల సూచన మేరకు హనుమకొండ జిల్లా పార్టీ ఆఫీసులో నిర్వహించేందుకు ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. జిల్లాస్థాయి సమావేశానికి కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు ఎవరూ వెళ్లవద్దని అధికార పార్టీ ఎమ్మె ల్యే ప్రకాశ్రెడ్డి హుకుం జారీ చేయడంతో పాటు ఎవరైనా సమావేశానికి వెళితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని బెదిరించినట్లు ఆర్జీపీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రడం భరత్ ఆరోపించారు. తాము కొండా వర్గీయులమని, తమపై కక్ష కట్టి పార్టీ కోసం పనిచేస్తున్న తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాడన్నారు. ఆర్జీపీఆర్ఎస్ విభాగంపై ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డికి ఆవగాహన లేక వర్గ విభేదాలు సృష్టిస్త్తూ సమావేశానికి ఎవరు రాకుండా అడ్డుకున్నాడన్నారు.