చెన్నారావుపేట, నవంబర్ 9: తాను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినా ఐదేళ్లలో నర్సంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో గొప్పగా అభివృద్ధి చేశానని, తాను చేసిన పనులను చూసి మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్రెడ్డి కోరారు. మండలంలోని అమీనాబాద్, పత్తినాయక్తండా, సూర్యాపేటతండా, గొల్లభామతండా, గొల్లపల్లె, ఖాదర్పేట, అక్కల్చెడ, కోనాపురం, లింగాపురం, కల్నాయక్తండా, జీడిగడ్డతండా, ఉప్పరపల్లిలో గురువారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దికి ప్రజలు బతుకమ్మలు, కోలాటాలతో ఘన స్వాగతం పలికారు. ప్రజా ఆశీర్వాదంతో ఎమ్మెల్యే ప్రచారం ఉప్పెనలా సాగింది. ప్రతి గ్రామం, తండాలో డప్పుచప్పుళ్ల మధ్య ర్యాలీలు నిర్వహించారు. దీంతో గ్రామాలన్నీ గులాబీమయమయ్యాయి. అనంతరం పెద్ది మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, పరుగులు పెడుతున్న అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆరే గ్యారెంటీ అని, ఎలాంటి గ్యారెంటీలు లేని మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని, కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోవద్దని ప్రజలను కోరారు.
మండలంలో అనేక అభివృద్ధి పనులు చేశానని చెప్పారు. కాంగ్రెస్ నేత దొంతి మాధవరెడ్డి తన సొంత ఊరికి కూడా ఏమీ చేయలేదని ఎద్దేవా చేశారు. తాను అమీనాబాద్లో రూ. కోటితో సహకార భవనం నిర్మించానన్నారు. దొంతి, రేవూరి ప్రకాశ్రెడ్డి ఏమాత్రం అభివృద్ధి చేశారో ప్రజలు గమనించాలని కోరారు. మరోసారి ఆశీస్సులు అందిస్తే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని పెద్ది హామీ ఇచ్చారు. ప్రచారంలో ఎన్నికల ఇన్చార్జి రాయుడి రవీందర్రెడ్డి, ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామీనాయక్, జడ్పీటీసీ పత్తినాయక్, పార్టీ మండల కన్వీనర్ కంది కృష్ణారెడ్డి, ఆర్బీఎస్ మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, సీనియర్ నాయకులు బాల్నె వెంకన్న, ఆర్బీఎస్ జిల్లా డైరెక్టర్ తూటి శ్రీనివాస్, క్లస్టర్ ఇన్చార్జి వీరారెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, మాజీ ఎంపీపీ జక్క అశోక్, మాజీ జడ్పీటీసీ రాంరెడ్డి, యూత్ అధ్యక్షుడు కృష్ణచైతన్యరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు సత్యనారాయణరెడ్డి, మురహరి రవి, సర్పంచ్లు కుండె మల్లయ్య, అనుముల కుమారస్వామి, కిషన్, రమేశ్, ఎంపీటీసీ ధరావత్ శ్రీను, కడారి సాయిలు, సొసైటీ డైరెక్టర్లు, రైతు కోఆర్డినేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నల్లబెల్లి: బీఆర్ఎస్కు మండలంలో రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతున్నది. ముచ్చింపుల, ఎర్రచెరువుతండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నుంచి 30 కుటుంబాలు ఎమ్మెల్యే పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న నర్సంపేట నియోజకవర్గంలోని రైతులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఇందులో భాగంగా డివిజన్లో ప్రధాన జలాశయాలైన పాకాల, రంగాయ చెరువు, మాదన్నపేట చెరువులోకి గోదావరి జలాలను తరలించి, రెండు పంటలు పండేలా కృషి చేసినట్లు చెప్పారు. సబ్సిడీపై ఆధునిక పనిముట్లను అందించారన్నారు. అంతేగాకుండా విద్య, వైద్యంతోపాటు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశారన్నారు. కన్నారావుపేటలో 54 ఎకరాల స్థలంలో హార్టికల్చర్ రిసోర్స్ సెంటర్ మంజూరు చేసినట్లు గుర్తుచేశారు. గ్రామాలకు లింకు రోడ్లు వేస్తూ తారురోడ్లు, సీసీరోడ్లు నిర్మించినట్లు వివరించారు. పార్టీలో చేరిన వారిలో గుగులోత్ దేవ్సింగ్, బద్దూనాయక్, రామ్సింగ్, లాలూనాయక్, హర్జీనాయక్, పలకల వీరారెడ్డి, మిరియాల రాజన్న, సాంబయ్య, ప్రభాకర్, కోక్య, బీక్యా, భద్రు, రవినాయక్, వెంకట్రాం, జగన్నాయక్, రమేశ్, బోడ నారాయణ, నాగరాజు, గుగులోత్ జగన్తోపాటు గోవిందాపూర్కు చెందిన పాడియ బాలు, ఓదెలు, విజయేందర్, శంకర్, కల్తి వెంకన్న, మధుకర్, చిన్నరాజులతోపాటు మరో 15 కుటుంబాలు బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో మండల ఎన్నికల ఇన్చార్జి చెట్టుపెల్లి మురళీధర్రావు, పార్టీ మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, మండల మాజీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్గౌడ్, సర్పంచ్ కరివేదుల వెంకట్రెడ్డి, నాయకులు రామునాయక్, సురేందర్నాయక్ పాల్గొన్నారు.
నర్సంపేటరూరల్: నర్సంపేట నియోజకవర్గాన్ని ఐదేళ్లలో పార్టీలకతీతంగా ఎంతో అభివృద్ధి చేశా.. అందుకే మళ్లీ ఓటు అడుగుతున్నానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. చంద్రయ్యపల్లికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త బరిగెల ప్రణీత్తోపాటు మరికొంత మంది ఎమ్మెల్యే పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో సర్పంచ్ బరిగెల లావణ్య-కిశోర్కుమార్, ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు జర్పుల వీరన్న, నాయకులు పెద్ది తిరుపతిరెడ్డి, భాషబోయిన రాజు, సుంకరి సంతోష్రెడ్డి, లెంకాల రాము, బయ్య నవీన్ ఉన్నారు. అదేవిధంగా గురిజాలకు చెందిన ఇప్ప నర్సింహస్వామి, కొక్కు రాకేశ్తోపాటు మరికొంత మంది బీఆర్ఎస్లో చేరగా, పెద్ది వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, ఉప సర్పంచ్ మంచిక హరీశ్, వార్డు సభ్యుడు కొక్కు రాంరాజ్ పాల్గొన్నారు.
నెక్కొండ: బీఆర్ఎస్తోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని బలంగా నమ్ముతూ విపక్ష నేతలు పార్టీలో చేరుతున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పిట్టకాయలబోడు(మత్తడి తండా), నాజీతండా నుంచి 60 కాంగ్రెస్ కుటుంబాలు పార్టీలో చేరగా, పెద్ది వారిని ఆహ్వానించారు. పల్లె, పట్నం, తండా అన్న తేడా లేకుండా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో బానోత్ రఘు, ఠాగూర్, లాలు నెహ్రూ, మహేందర్, కుమార్, జగ్గు, మోహన్, సుమన్, ఆలు, బాలు, రమేశ్, రవి, లాల్సింగ్, వెంకన్న, సదన్సింగ్, బదావత్ నెహ్రూ, ధరావత్ మోహన్, ధరావత్ రమేశ్, బానోత్ వెంకన్న, మంచ, రవి, బాదావత్ భద్రు ఉన్నారు. కార్యక్రమంలో రెడ్లవాడ సొసైటీ చైర్మన్ జలగం సంపత్రావు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అలాగే, సూరిపల్లి నుంచి 15 కాంగ్రెస్ కుటుంబాలు బీఆర్ఎస్లో చేరాయి. పార్టీలో చేరిన వారిలో దొమ్మడి పురుషోత్తం, కొంకాల రమేశ్, ఎండీ సలీం పాషా, బత్తిని సారంగం, కొత్తకొండ అశోక్, కనుకాల నవీన్, రాజు, సున్నపు వెంకన్న, భూకొండ సారంగం, సొల్లేటి వెంకన్న, రుద్రారపు రాంరాజు, ఇరుకు సాయిబాబు పాల్గొన్నారు.