హనుమకొండ చౌరస్తా, మే 30 : కాంగ్రెస్ పార్టీ పేదలపై ప్రతాపం చూపుతున్నదని, కూరగాయలు అమ్మేవారి జీవితాలను కూల్చుతున్నదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాసర్ మం డిపడ్డారు. హనుమకొండ చౌరస్తా వద్ద ఉన్న చిరువ్యాపారుల సముదాయాలను మున్సిపల్, పోలీసు అధికారులు తొలగించిన నేపథ్యంలో వారిని శుక్రవారం ఆయన కలిశారు. ఈ సందర్భంగా బాధితులు 15 ఏం డ్లుగా చౌరస్తాలో చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ, కూరగాయలు అమ్ముతూ జీవనోపాధి పొందుతున్నామని, ఇటీవల పోలీసు, మున్సిపల్ అధికారులు తమ పొట్టకొట్టారని, వ్యాపార సముదాయాలను కూ ల్చారని కన్నీటి పర్యంతమయ్యారు.
తమకు న్యాయం చేయాలని గోడు వెళ్లబోసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదలపై ప్రేమ లేదని, తమ జీవితాలను ఆగం చేసిందని వాపోయారు. పిండి రమేశ్ అనే చిరువ్యాపారి తన జీవితం ఆగమైందని, జీవనోపాధి కోల్పోయామని ఆత్మహత్యాయత్నం చేసుకొని ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతున్నాడని బాధిత కుటుంబ సభ్యులు వినయ్భాసర్కు తెలిపారు. మరో మహిళ తన కూతురుతో సహా ఇకడ ఏండ్లుగా కూరగాయలు అమ్ముతూ జీవిస్తున్నానని, ప్రస్తుతం రోజు గడవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం వినయ్భాసర్ మాట్లాడుతూ.. కార్మికుల హకులను కాల రాస్తే ఊరుకోమని, కార్మికులకు అండగా ఉద్యమిస్తామన్నారు.
చిరువ్యాపారుల జీవితాలతో చెలగాటమొద్దని, వారికి ప్రభుత్వం నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని, చౌరస్తాలోని వారి అడ్డాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక శాసన సభ్యులు, మున్సిపల్ మేయర్ కాజీపేట నుంచి వరంగల్ రైల్వేస్టేషన్ వరకు ప్రధాన రహదారి వెంట ఉన్న చిరువ్యాపారుల సముదాయాలను ధ్వంసం చేస్తున్నారని, వారి జీవితాలను చిధ్రం చేస్తున్నారని మండిపడ్డారు. 2014 చిరువ్యాపారుల చట్టం ఉన్నా వారి పొట్ట కొడుతున్నారని, చట్టాలపై అవగాహనలేని ప్రభుత్వం పేదల బతుకులను ప్రశ్నార్థకం చేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పులి రజినీకాంత్, 4వ డివిజన్ అధ్యక్షుడు కంజర్ల మనోజ్కుమార్, 5వ డివిజన్ అధ్యక్షుడు బొల్లపెల్లి చందర్ పాల్గొన్నారు.