ఖమ్మంలో కనీవినీ ఎరుగని రీతిలో బీఆర్ఎస్ సభ విజయవంతమైతే కాంగ్రెస్, బీజేపీలు కడుపుమంటతో రగిలిపోతున్నాయని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దుయ్యబట్టారు. ‘ఇసుకరాలనంత జనాలు వస్తే ఆ పార్టీలకు కళ్లుండీ కనిపించ లేదా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కండ్లకు పొరలు కమ్మినట్లున్నయ్.. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆయనకు కనిపించకుంటే కంటి వెలుగు పథకంలో చూపెట్టుకోవాలె’ అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్యే అరూరి రమేశ్తో కలిసి మంత్రి హనుమకొండలోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు.
హనుమకొండ, జనవరి 19 : ఖమ్మంలో నిర్వహించిన భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ సభ సక్సెస్తో బీజేపీ, కాంగ్రెస్ నాయకుల్లో వణుకు పుడుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. హనుమకొండలోని క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్, ఎంపీ పసునూరి దయాకర్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ముందుగా ఖమ్మం సభ సక్సెస్ చేసిన ప్రతి ఒకరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. లక్ష్యానికి మించి ఖమ్మం సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తే.. ఆవిర్భావ సభ అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులపై మంత్రి ఫైర్ అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఆవిర్భావ సభకు తరలివచ్చిన ప్రజలు గంటల తరబడి వేచి ఉండి కేసీఆర్ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారని తెలిపారు.
తెలంగాణపై మోదీ సవతితల్లి ప్రేమ చూపిస్తుంటే, సీఎం కేసీఆర్ కన్నతల్లి, తండ్రిలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే దేశంలో కాంగ్రెస్ కనిపించకుండా పోయిందని, ఈసారి ప్రజలు బీజేపీ భరతం పట్టడం ఖాయమన్నారు. దేశాన్ని అందరికీ ఆమోదయోగ్యంగా పాలించే సత్తా, దమ్ము ఒక సీఎం కేసీఆర్కే ఉందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో చేసిన అభివృద్ధి, తాము తెలంగాణలో చేసిన అభివృద్ధి, మిషన్ భగీరథపై చర్చ చేద్దామా అని అడిగారు. తాము దేశమంతా సాగుకు ఉచిత విద్యుత్, దళితులకు దళితబంధు ఇస్తామంటే మీకెందుకు కడుపుమంట, విభజన, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? రాష్ట్రానికి ఇచ్చిన నిధులు ఎన్ని? మీరు ఎగ్గొట్టిన మా వాటా ఎంత? అని ప్రశ్నించారు. దేశమంతా సీఎం కేసీఆర్ను ఆదర్శంగా తీసుకుంటుంటే మీకెందుకు కడుపుమంట అని మండిపడ్డారు. కంటి వెలుగు అద్భుతమైన కార్యక్రమమని, దాన్ని ఆదర్శంగా తీసుకొని తమ రాష్ర్టాల్లో అమలు చేస్తామని ఖమ్మం సభలోనే పలువురు సీఎంలు ప్రకటించారని మంత్రి గుర్తుచేశారు. రైతుబంధు, మిషన్ భగీరథ వంటి తెలంగాణ పథకాలు భేష్ అన్న కేంద్రమే దేశమంతా అమలు చేస్తున్నదని వివరించారు.
అభివృద్ధి, సంక్షేమం కనిపించడం లేదా?
చేతకాని రేవంత్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు విజ్ఞత, తెలివి లేకుండా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని నాశనం అవుతుంటే కాపాడుకోలేని దద్దమ్మలన్నారు. ముందుగా పార్టీని కాపాడుకోవాలని హితవు పలికారు. రాహుల్గాంధీ పాదయాత్రలో ఏ ముఖ్య మంత్రి పాల్గొన్నారని ప్రశ్నించారు. నోరు మూసుకొని కూర్చో రేవంత్రెడ్డి అని హెచ్చరించారు. ‘బండి సంజయ్ కండ్లకు పొరలు కమ్మినట్లున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు మీకు కనిపించడం లేదా? కంటి వెలుగు శిబిరాల్లో పరీక్షలు చేయించుకోండి.. ఉచితంగా అద్దాలు ఇస్తున్నాం.. తీసుకో నీ కండ్లు, బుర్ర కాస్త పని చేస్తుందేమో చూడు’ అని మంత్రి ఎద్దేవా చేశారు. క్రికెట్ మ్యాచ్ తప్ప ఖమ్మం మీటింగ్ను ఎవరూ పట్టించుకోలేదు అంటావా? అని మంత్రి ఆగ్రహించారు. కర్ణాటక మాజీ సీఎం రాలేదు, బీహార్ తాజా సీఎం రాలేదు.. ఎవరు వస్తే నీ కేంది రాకపోతే నీకెందుకు? అంత ఉంటే వాళ్లనే అడుగు చెబుతారని బండి సంజయ్పై ధ్వజమెత్తారు.
కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి పాదయాత్రలో ఉన్నారు బీహార్ సీఎం బిజీగా ఉన్నారని చెప్పారు. చిల్లర మాటలతో జాతీయ నేతలను అవమానించడం సంసారం కాదని హితవుపలికారు. తొండి సంజయ్కి 24 గంటల విద్యుత్పై సందేహాలు ఉంటే ఎకడైనా విద్యుత్ తీగను పట్టుకో.. నీకు తెలుస్తదని మంత్రి అన్నారు. బీఆర్ఎస్ సంగతి నీ కెందుకు? ముందు నీ బీజేపీ సంగతి చూసుకో అని సూచించారు. ప్రధానిని ఆకాశానికి ఎత్తుతున్న కిషన్రెడ్డి కేంద్ర మంత్రిగా తెలంగాణకు ఏమి తెచ్చాడని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ను తిట్టడంపై మండిపడ్డారు. జల వివాదాలు పరిషరించకుండా నాన్చింది మీరు కదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల నిధులు పక్కదారి పట్టించారని కిషన్రెడ్డి అనడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర హకుగా వస్తున్న ఫైనాన్స్ కమిషన్ నిధులకు సమానంగా రాష్ట్రం నిధులు ఇచ్చి గ్రామాలను అభివృద్ధి చేసిందని చెప్పారు. దేశంలో ఇంకా రైతులపై కాల్పులు, ఆకలి కేకలు, ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్పరం చేయడంపై మాట్లాడాలని, దేశంలో ఏటా ఇస్తామన్న 2కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. దేశంలో కాంగ్రెస్కు కాలం చెల్లిందని, బీజేపీ దేశానికి భారంగా మారిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని, ఇక నుంచి ఆటలు చెల్లవని ఖమ్మం సభ సందేశం ఇచ్చిందని పేర్కొన్నారు.
దేశ వ్యాప్తంగా ఉచిత విద్యుత్..
తెలంగాణ మాదిరిగానే దేశవ్యాప్తంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తామని మంత్రి తెలిపారు. విద్యుత్ రంగాన్ని అదానీకి కట్టబట్టే కుట్రను ఉద్యోగులతో కలిసి ప్రతిఘటిస్తామని ఎర్రబెల్లి పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మింది ఎవరో అందరికీ తెలుసని, దేశ సంపదను ఇద్దరు గుజరాతీలు మరో గుజరాతీకి అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. దేశంలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలిపారు.
సభ గ్రాండ్ సక్సెస్ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్భాస్కర్
ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు కళ్లున్న కబోదులు అని విమర్శించారు. కంటివెలుగు కార్యక్రమంలో కళ్ల పరీక్ష చేయించుకోవాలని హితవు పలికారు. కుట్రలు, కుతంత్రాలు, విద్వేషాలు రగిలించే బీజేపీకి తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం కనుమరుగవడం ఖాయం జోస్యం చెప్పారు. రాబోయేది కేసీఆర్ సరారేనన్న చీఫ్ విప్.. బీజేపీ నాయకులకు దమ్ముంటే విభజన హామీలపై ప్రధానితో ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ సభ కొత్త చరిత్రకు నాంది
ఎమ్మెల్యే అరూరి రమేశ్
ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ కొత్త చరిత్రకు నాంది అని ఎమ్మెల్యే అరూరి రమేశ్ పేర్కొన్నారు. స్వచ్ఛందంగా వచ్చిన జన సందోహం చూసి బీజేపీ వెన్నులో వణుకు మొదలైందన్నారు. ఫ్రీ కరంటు, దళితబంధు, రైతు అనుకూల నిర్ణయాల ప్రకటనలతో బీజేపీ భయపడుతోందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై కేంద్రంలోని బీజేపీ వివక్ష చూపుతోందన్నారు. బీజేపీ ప్రైవేట్ పరం చేసిన అన్ని సంస్థలను తిరిగి ప్రభుత్వ పరం చేస్తామన్నారు. బీజేపీ నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్ అని హెచ్చరించారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, నగర మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్రాజ్యాదవ్, రైతుబంధు సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు ఎల్లావుల లలితాయాదవ్, జీసీసీ మాజీ చైర్మన్ ధరావత్ గాంధీనాయక్ పాల్గొన్నారు.