నెక్కొండ, సెప్టెంబర్ 1: మండలంలోని నాగారం గ్రామంలో ప్రతిపక్షం ఖాళీ అయింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ, బీజేపీకి చెందిన ముఖ్య నాయకులు, మాజీ సర్పంచ్, నలుగురు వార్డు మెంబర్లు, వందకు పైగా కుటుంబాలు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. ప్రతిపక్షాలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరడంతో నాగారంలో ఆయా పార్టీల కథ కంచికి చేరినట్లయింది. అభివృద్ధికి పట్టం కడుతూ.. నాయకులంతా ఒక్కతాటిపైకి వచ్చి ప్రతిపక్ష పార్టీలకు గుడ్బై చెప్పి.. బీఆర్ఎస్లో చేరడంతో నాగారం నుంచి నయా ట్రెండ్ మొదటైంది. కాంగ్రెస్ పార్టీకి ముఖ్య నాయకుడు, వార్డు మెంబర్ నాంపల్లి శ్రీను, బీజేపీకి చెందిన మాజీ సర్పంచ్ శీలం వెంకన్న, వార్డు సభ్యులు శీలం సువర్ణ, రెబల్లి సుజాతా ముఖేశ్, చెంచు వెంకటలక్ష్మితోపాటు వందకుపైగా కాంగ్రెస్, బీజేపీకి చెందిన కుటుంబాల సభ్యులకు పెద్ది గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఒక్కతాటిపైకి రావాలి..
గ్రామం అభివృద్ధి కోసం నాయకులంతా ఐక్యంగా కలిసి వచ్చారని, అన్ని గ్రామాలు ఇదే స్ఫూర్తితో ఒక్కతాటిపైకి రావాలని ఎమ్మెల్యే పెద్ది పిలుపునిచ్చారు. చిరకాల ప్రత్యర్థులు ఏకమై.. ఒకే వేదికపైకి రావడంతో స్నేహపూర్వక వాతావరణం ఏర్పడం ఆనందంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయని, ప్రజలంతా ఏకం కావాలని కోరారు. జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న సొంత గ్రామమైన నాగారాన్ని బ్రహ్మండంగా అభివృద్ధి చేశామన్నారు. ఆలయ నిర్మాణం, దళితబంధు, దళితులకు మూడెకరాల భూమి పంపిణీ, వట్టెవాగుపై బ్రిడ్జి, సీసీరోడ్ల నిర్మాణం.. ఇలా నాగారం కనీవినీఎరుగని రీతిలో అభివృద్ధి చెందిందన్నారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రజలకు చేరినందునే అందరూ బీఆర్ఎస్ను బలపరుస్తున్నారని స్పష్టం చేశారు. గ్రామాలన్నీ నాగారం మాదిరిగా ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న, ఎంపీపీ జాటోత్ రమేశ్, జడ్పీటీసీ లావుడ్యా సరోజా హరికిషన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, నాయకులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరిన వారి వివరాలు..
కాంగ్రెస్ పార్టీ నుంచి వార్డు మెంబర్ నాంపల్లి శ్రీను, రేబల్లి లోకేశ్, ఉండ్రాతి వెంకన్న, రామడుగు రాజు, మద్దెబోయిన అశోక్, బోళ్ల యాకయ్య, యలగందుల సోమయ్య, గాడ్ల చిన్నబాలయ్య , ఉప్పలి భద్రయ్య, పోతరాజు చేరాలు, మల్లం శ్రీను, పొనకంటి రాజు, నాంపల్లి రాంచంద్రు, రాజు, ఎండీ సహీరా, గండ్ల భిక్షపతితోపాటు పలు కుటుంబాలు. అలాగే, బీజేపీ నుంచి మాజీ సర్పంచ్ శీలం వెంకన్న, వార్డు సభ్యులు సువర్ణ, సుజాతా ముఖేశ్, చెంచు వెంకటలక్ష్మి, అటిక కట్టయ్య, బొడ్డు వీరస్వామి, చెందు సుధాకర్, దారపు వెంకటేశ్తోపాటు పలు కుటుంబాలు బీఆర్ఎస్లో చేరాయి.
అభివృద్ధిలో అగ్రభాగాన నిలిచాం..
ప్రణాళికాబద్ధంగా పని చేయడంతోనే నర్సంపేట నియోజకవర్గం అభివృద్ధిలో అగ్రభాగాన నిలిచిందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నెక్కొండలో కాంగ్రెస్, బీజేపీకి చెందిన పలు కుటుంబాలు పెద్దసంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. అనంతరం జరిగిన సమావేశంలో పెద్ది మాట్లాడుతూ తాను నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట తప్పలేదన్నారు. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను పరిష్కరిస్తూనే తగిన ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ఏ రోజైనా విపక్ష ఎమ్మెల్యేలు గాని, విపక్ష నాయకులు గాని ప్రభుత్వం తమకు ఈ పని చేసి పెట్టాలంటూ అడిగిందే లేదన్నారు. ఆలోచన మనదే.. అభివృద్ధి మనదే.. అనే నినాదంతో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నదన్నారు. విపక్ష ఎమ్మెల్యేలకు రాజకీయపరంగా శాశ్వత విరామం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా సమయంలో నియోజకవర్గంలో వ్యాక్సిన్లు, ఆక్సిజన్ కొరత లేకుండా చేశానన్నారు. బీఆర్ఎస్ యువత నుంచి 8500 యూనిట్ల రక్తాన్ని సేకరించి అందించామని, దేశంలో ఇదో రికార్డు అన్నారు. ఆ సమయంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేల జాడ కానరాలేదన్నారు. నియోజకవర్గం ప్రజలంతా ఒక విజన్ ఉన్న నాయకుడి వెంట నడిచేందుకు సిద్ధమయ్యారన్నారు. లీడర్, కేడర్ లేని పార్టీలను వీడి ప్రజలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు.
అన్ని విధాలా అభివృద్ధి పనులు
నెక్కొండ పట్టణ పరిధిలో ఒక రైల్వే అండర్ బ్రిడ్జి, ప్రధాన రహదారి అభివృద్ధి, డివైడర్ల ఏర్పాటుతోపాటు ప్రతి గల్లీలోనూ సీసీరోడ్లను నిర్మించినట్లు ఎమ్మెల్యే పెద్ది అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు కొండంత అండనిస్తున్నాయన్నారు. నెక్కొండలో కాంగ్రెస్, బీజేపీకి చెందిన వంద కుటుంబాలు బీఆర్ఎస్లో చేరగా, వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈదునూరి సురేశ్, మోతె గౌతమ్, ఈదునూని నవీన్, పొలిశెట్టి వినయ్, కనకం అన్వేశ్, ఈదునూరి వెంకన్న, జన్ను అరుణ్, జంపాల కేదారి, ప్రకాశం, రేకుల రాజేందర్తోపాటు పలు కుటుంబాలు పార్టీలో చేరాయి. ముందుగా నెక్కొండలో తెలంగాణతల్లి కూడలి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ జాటోత్ రమేశ్, జడ్పీటీసీ లావుడ్యా సరోజా హరికిషన్, నెక్కొండ సొసైటీ చైర్మన్ మారం రాము, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, పీపీ అబ్దుల్ నబీ, నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేశ్యాదవ్, సొసైటీ మాజీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్రెడ్డి, సీనియర్ నాయకులు చల్లా చెన్నకేశవరెడ్డి, పట్టణ అధ్యక్షుడు కొణిజేటి భిక్షపతి, నాయకులు కట్కూరి నరేందర్, బొల్లెబోయిన వీరస్వామి, కట్కూరి నరేందర్రెడ్డి, నెక్కొండ ఉప సర్పంచ్ వీరభద్రయ్య పాల్గొన్నారు.