నర్సంపేటరూరల్, నవంబర్ 5: ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు రైతుల జీవితాల్లో వెలుగులు నింపారని, గిరిజనుల పోడు భూములకు పట్టాలిచ్చిన బీఆర్ఎస్ సర్కారును ప్రతి ఒక్కరూ ఆదరించాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని నర్సింగాపురం, ఇటుకాలపల్లి, ఆకులతండా, ఇప్పల్తండా, కొండసముద్రంతండా, ఏనుగల్తండా, ముత్యాలమ్మతండా, జంగాలపల్లితండా, గార్లగడ్డతండా, రాజుపేట, ముత్తోజిపేట, రామవరం, రంగంపల్లి, లక్నేపల్లి, మర్రినర్సయ్యపల్లిలో ఆదివారం పెద్ది ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగింది. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మ, బోనాలు, కోలాటాలతో, పురుషులు డప్పుచప్పుళ్లతో ఎమ్మెల్యే పెద్దికి ఘన స్వాగతం పలికారు. జై తెలంగాణ నినాదాలు మార్మోగగా.. నర్సంపేట మండలం గులాబీమయమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంతో పోల్చితే నర్సంపేట నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. మారుమూల గ్రామాలు, శివారు పల్లెలకు కూడా అభివృద్ధి రుచి చూపించామన్నారు. గడిచిన ఐదేళ్లలో స్థానికంగా ఉంటూ ఎన్ని అభివృద్ధి పనులు చేశానని, ఎన్నో సమస్యలు పరిష్కరించానని తెలిపారు. ప్రజలు కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఎమ్మెల్యే పెద్ది హెచ్చరించారు.
మాదన్నపేట పెద్ద చెరువులోకి గోదావరి జలాలు తీసుకొచ్చి ఈ ప్రాంత రైతులు రెండు పంటలు సాగు చేసుకునేలా నీరు అందించానని పెద్ది అన్నారు. మాదన్నపేట పెద్ద చెరువు మినీట్యాంక్బండ్లో భాగంగా నిధులు తీసుకొస్తే.. కాంట్రాక్ట్ దక్కించుకున్న మాజీ ఎమ్మెల్యే మాధవరెడ్డి పనులు సరిగా చేయకుండా వదిలేశాడని విమర్శించారు. నర్సంపేటలో 36 కులాల కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి నిధులు తీసుకొస్తే.. బుద్ధిలేని కాంగ్రెస్ నాయకులు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ మోతె కళావతి, జడ్పీటీసీ కోమాండ్ల జయ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, ఆర్బీఎస్ మండల కన్వీనర్ మోతె జయపాల్రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కొడారి రవన్న, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు భూక్యా వీరన్న, క్లస్టర్ ఇన్చార్జీలు మచ్చిక నర్సయ్యగౌడ్, మోతె పద్మనాభరెడ్డి, కోమాండ్ల గోపాల్రెడ్డి, కడారి కుమారస్వామి, తాళ్లపెల్లి రాంప్రసాద్, కట్ల సుదర్శన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మురాల మోహన్రెడ్డి, సర్పంచ్లు మండల రవీందర్, బానోత్ సుజాత, భూక్యా సైద, స్వాతి, దస్రూ, గోలి శ్రీనివాస్రెడ్డి, గొడిశాల రాంబాబుగౌడ్, ఎంపీటీసీలు ఉల్లేరావు రజిత, వీరూనాయక్ పాల్గొన్నారు.
నల్లబెల్లి: ఎవరు ప్రలోభ పెట్టినా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తలవంచొద్దని ఎమ్మెల్యే పెద్ది కోరారు. కొద్దిరోజులుగా నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పలురకాల ప్రలోభాలకు గురి చేస్తూ విచ్చలవిడిగా మద్యం, డబ్బును ఎర చూపుతూ పార్టీ పిరాయింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఆ పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ నాయకుల చిల్లర రాజకీయాలను తట్టుకోలేని తెలంగాణ ఉద్యమకారులు తిరిగి సొంతగూటికి చేరుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ మేరకు శనిగరం గ్రామానికి చెంగదిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు ఓరుగంటి రాజు పెద్ది సమక్షంలో తిరిగి బీఆర్ఎస్ చేరాడు. కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాలెపు రాజేశ్వర్రావు, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్గౌడ్, మీడియా మండల ఇన్చార్జి అంబరగొండ రాజు, అశోక్గౌడ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.