హనుమకొండ, జూలై 3:తెలంగాణ రాజకీయాల్లో బాహుబలి సీఎం కేసీఆర్. రాష్ట్రంలో నంబర్ వన్ పార్టీ బీఆర్ఎస్. తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ అని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. సోమవారం హనుమకొండలోని హరిత కాకతీయలో చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్తో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఖమ్మం కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీ మాటలన్నీ ప్రజలను మోసం చేసేలా ఉన్నాయని విమర్శించారు. ప్రపంచ మేధావులు అబ్బురపడేలా రూ.80వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తే రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందనడం ఆయన అవగాహనా రాహిత్యమన్నారు. కేంద్రంలోని బీజేపీ తెలంగాణపై వివక్ష చూపుతూ అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు. చీఫ్ విప్ వినయ్భాస్కర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో బీజేపీ డ్రామాలు ఆడుతోందని, కాజీపేటలో వ్యాగన్
పరిశ్రమ ఎన్నికల స్టంట్ అని విమర్శించారు.
తెలంగాణ రాజకీయాల్లో బాహుబలి సీఎం కేసీఆర్, రాష్ట్రంలో నంబర్ వన్ పార్టీ బీఆర్ఎస్ అని మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్తో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనగర్జన సభలో రాహుల్గాంధీ ఇచ్చిన హామీలు తెలంగాణ ప్రజలను అవమాన పరిచేలా, మోసం చేసేలా ఉన్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి భయపడి పారిపోయిన రాహుల్ గాంధీ, ఇప్పుడు ప్రధాని కావాలని కలలు కంటున్నాడని ఎద్దేవా చేశారు. జాతీయస్థాయి నాయకుడికి కనీస అవగాహన లేకపోవడం విచారకరమన్నారు. జాతీయ పార్టీలకు దేశమంతా ఒకే విధానం ఉండాలని హితవు పలికారు. ప్రపంచంలోని మేధావులు అబ్బుర పరిచే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చర్చించుకుంటుంటే లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.80వేల కోట్లు ఖర్చయితే రూ.లక్ష కోట్లు అవినీతి జరిగిందనడం అవగాహన రాహిత్యమన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయగా ఫలితాలను ప్రజలు అనుభవిస్తున్నారని తెలిపారు. రేవంత్రెడ్డి, భట్టి విక్రమార్క రాసిచ్చిన స్క్రిప్టు మాత్రమే రాహుల్గాంధీ చదివాడని విమర్శించారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే ద్వారా పింఛన్ రూ.4వేలు చేస్తామనడం సంతోషంగా ఉందన్న కడియం ఇటీవల కర్నాటకలో గెలిచి ఎంతిస్తున్నారని ప్రశ్నించారు. అక్కడ రూ.800 ఇస్తూ తెలంగాణలో రూ.4వేలు ఇస్తామనడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. పెన్షన్ ప్రకటన ఎన్నికల కోసం చేసిందేనని, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు. తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష అన్నారు.
పోరాటాల ఫలితంగానే తెలంగాణ
కేసీఆర్ నాయకత్వంలో మలిదశ పోరాటాలు, అనేక మంది బలిదానాలతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని, తెలంగాణను కాంగ్రెస్ ఇవ్వలేదని, గుంజుకున్నామని కడియం చెప్పారు. అవినీతికి పేటెంట్ కాంగ్రెస్ పార్టీయేనని, కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నాయకులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని, దేశానికి సాంలను పరిచయం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఎద్దేవా చేశారు. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయేనని స్పష్టం చేశారు.
బీజేపీకి సింగిల్ డిజిట్
బీజేపీ గ్రాఫ్ జీరోకు పడిపోయిందని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ డిజిట్కే పరిమితం అవుతుందని కడియం అన్నారు. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండాలని కోరుకుంటున్నానని.. ఆయన భాష, వ్యవహార శైలిపై ప్రజలతోపాటు బీజేపీ నాయకులు సైతం అసహ్యించుకుంటున్నారని, ఆయన బీజేపీ అధ్యక్షుడిగా ఉంటే బీఆర్ఎస్కే లాభమని కడియం పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని చూస్తుంటే జాలేస్తోందని, గిరిజన యూనివర్సిటీ గురించి అవగాహన లేకుండా మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ములుగులో భూమి కేటాయించగా కేంద్రం ప్రభుత్వం కూడా ఆమోదించిందని, రానున్న పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేసి వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తప్పులన్నీ బీజేపీ వద్ద పెట్టుకొని మంత్రి కిషన్రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.తెలంగాణపై వివక్ష చూపుతున్న కేంద్రం అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు. అప్పర్ బదా ప్రాజెక్టుకు, మధ్యప్రదేశ్లో కెన్బెటావా ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి కాళేశ్వరానికి ఇవ్వకపోవడం వివక్ష కాదా? ప్రశ్నించారు. కిషన్రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్కు ఈ వివక్ష కనిపించడం లేదా అని కడియం మండిపడ్డారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలోనూ కేంద్రం వైఖరి తెలుపడం లేదన్నారు. కాజీపేట కోచ్ కావాలని అనేక ఏళ్లుగా ఉద్యమాలు జరగ్గా విభజన చట్టంలో పొందుపరిచారని, ఇప్పుడు అది కాకుండా వ్యాగన్ మాన్యుఫాక్చరింగ్ సెంటర్ చేస్తామని, 8న ప్రధాని మోదీ ప్రారంభిస్తారంటున్న బీజేపీ నేతలు డీపీఆర్, కేబినెట్ ఆమోదం లేకుండా ఏలా ఏర్పాటు చేస్తారో చెప్పాలన్నారు. తొమ్మిదేళ్లలో తెలంగాణకు ఎన్ని నిధులిచ్చారు? గుజరాత్కు ఇచ్చిన నిధులపై వరంగల్లో బహిరంగ చర్చకు కిషన్రెడ్డి సిద్ధమా? అని కడియం సవాల్ విసిరారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన బీజేపీకి తెలంగాణలో ఓట్లు అడిగే నైతిక హకు లేదని, వరంగల్లో సభ పెట్టే అర్హత బహిరంగ సభల పేరుతో కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. ఎన్నికలు వస్తున్నందున మభ్యపెట్టేందుకు రెండు పార్టీలు వస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తెలంగాణకు శ్రీరామ రక్ష సీఎం కేసీ ఆర్ అని అన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్న దేశ ప్రజలు;చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్
తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికి ఆదర్శంగా నిలపడంతో ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్కు వస్తున్న ఆదరణకు భయపడుతున్నారని తెలిపారు. ఖమ్మం కాంగ్రెస్ సభను చూసి ప్రజలు నవ్వుకుంటున్నా రని, అమలు కానీ హామీలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజలు నమ్మరన్నారు. పోడు పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దన్నారు. తొమ్మిదేళ్లుగా ఒక్క హామీ నెరవేర్చకుండా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీజేపీ డ్రామాలు ఆడుతోందన్నారు. వరంగల్ ప్రజల చిరకాల వాంఛ కోచ్ ఫ్యాక్టరీ విషయంలో గతంలో కాంగ్రెస్ దగా చేస్తే ఇప్పుడు మోసం చేసిందన్నారు. కాజీపేటలో ఏర్పాటు చేసే వ్యాగన్ తయారీ యూనిట్పై అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతుండగా, పరిశ్రమ ఎన్నికల స్టంట్గా భావిస్తున్నట్లు తెలిపారు. కోచ్ ఫ్యాక్టరీ సాధించే వరకూ పోరాటం ఆగదన్నారు. ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని చీఫ్ విప్ అన్నారు.